ఏప్రిల్ 20, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి భక్తి శ్రద్దలతో బంగారు బోనం..

ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి భక్తి శ్రద్దలతో బంగారు బోనం..
  • పాతబస్తీ నుంచి సికింద్రాబాద్ కు తరలి వెళ్లిన భక్తులు
  • వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు
  • బంగారు బోనం,పట్టు వస్త్రాల సమర్పణ..
  • లాల్ దర్వాజ సింహవాహిణి దేవాలయం నుంచి సికింద్రాబాద్ కు ఊరేగింపు..
  • భాజాభజంత్రీల నడుమ కొనసాగిన బంగారు బోనం ఊరేగింపు
  • ఈ నెల 27న, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బంగరు బోనం.

 

ఆర్సీ న్యూస్,జూలై 22 (హైదరాబాద్):  పాతబస్తీకి చెందిన అమ్మవారి భక్తులు గురువారం  బంగారు పాత్రలో బోనంతో పాటు పట్టు వస్త్రాలను తీసుకుని సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి భక్తి శ్రద్దలతో సమర్పించారు. ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను పుర స్కరించుకుని గురువారం పాతబస్తీ లాల్ దర్వాజలో భక్తుల సందడి నెలకొంది. లాల్ దర్వాజ సింహవాహిణి దేవాలయంలో భక్తులు అమ్మవారికి పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షులు బత్తుల బల్వంత యాదవ్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగాయి. భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. పాతబస్తీ నుంచి భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో భక్తులు సికింద్రాబాద్ ఉజ్జయినీ దేవాలయానికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించారు. 

  • ఊరేగింపు కమిటి ఉపాధ్యక్షులు  కె.ఎస్.ఆనంద్ రావు, ఆకుల వేణుగోపాల్, లాల్ దర్వాజ సింహవాహిణి దేవాలయం కమిటి చైర్మన్ కె.వెంకటేష్ తదితరుల బ్రుందం ఉజ్జయినీ మహాంకాళి దేవాలయానికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలతో భయలు దేరి వెళ్లారు.
  •  ముందుగా లాల్ దర్వాజ సింహవాహిణీ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బంగారు పాత్రలో బోనంతో పాటు పట్టు వస్త్రాలను తీసుకుని ఊరేగింపుగా బయలు దేరారు. 
  • దారి పొడవు నా న్రుత్యాలు, బ్యాండ్ మేళాలతో లాల్ దర్వాజ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున సామూహిక ఊరేగింపు నిర్వహించారు.
  •  అనంతరం అక్కడి నుంచి వాహనాలలో సికింద్రాబాద్ చేరుకున్నారు.
  • ఉజ్జయినీ మహాంకాళి దేవాలయం వద్ద భాజాభజంత్రీల నడుమ ర్యాలీ నిర్వహించి అమ్మవారికి నైవేధ్యం సమర్పించి పట్టు వస్త్రాలు అందజేశారు. 
  • ఆలయ నిర్వాహకులు పాతబస్తీ నుంచి వచ్చిన బంగారు బోనం ఊరేగింపుకు ఘనంగా స్వాగతం పలికారు. 

ఏడుగురు అమ్మవార్లకు ఏడు బంగారు బోనాలు…

  • సప్త మాత్రుకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా ఏడుగురు అమ్మవార్లకు ఏడు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని ఊరేగింపు కమిటి అధ్యక్షులు బత్తుల బల్వంత్ యాదవ్ తెలిపారు. 
  • ఈ సందర్బంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ…మొదటి బంగారు బోనంగా గోల్కోండ జగదాంబ అమ్మవారికి..రెండో బోనంగా బల్కంపేట అమ్మవారికి.. మూడో బోనంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి, నాలుగవ బోనంగా విజయవాడలో కనక దుర్గమ్మ తల్లికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించామన్నారు.
  •  ఐదో బోనంగా గురువారం సికింద్రబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి బోనం సమర్పించామన్నారు.
  •  బంగారు బోనం ఊరేగింపు, సమర్పణ సందర్బంగా భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. 
  • కరోనా వైరస్ కట్టడి చర్యలు పాటిస్తూనే బంగారు బోనం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 
  • సప్త మాత్రుకల సప్త బంగారు బోనం కార్యక్రమం లో భాగంగా ఈ నెల 27న, చార్మినార్ భాగ్యలక్ష్మిఅమ్మవారికి బంగారు బోనం,పట్టు వస్త్రాలు సమర్పించనున్నా మన్నారు.

23న, కలశ స్థాపనతో పాతబస్తీలో బోనాల జతర ఉత్సవాలు ప్రారంభం…

  • ఇక ఈ నెల 23న నిర్వహించే కలశ స్థాపనతో పాతబస్తీలో బోనాల జాతర ఉత్సవాలు మొదలవుతాయని బల్వంత్ యదవ్ అన్నారు. 
  • కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కన్నుల పండువగా బోనాల జాతర ఉత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. 
  • ఈ నెల 25న పాతబస్తీలో నిర్వహించే అమ్మవారి ఘట స్థాపన సామూహిక ఊరేగింపుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
  •  ఊరేగింపు అనంతరం ఆయా దేవాలయాలలో అమ్మవారి ఘట స్థాపన జరుగుతుందన్నారు,
  • ఆగస్టు 1వ తేదీన నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు పాతబస్తీలో అమ్మవారికి బోనాల సమర్ఫన కార్యక్రమం ఉంటుందన్నారు.
  • 2న, పాతబస్తీ వీధుల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు.