మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

దివ్య కాశీ.. భవ్య కాశీ..

దివ్య కాశీ.. భవ్య కాశీ..
  • రూ.1000 కోట్లతో కాశీ విశ్వనాథ కారిడార్ ప్రాజెక్ట్..
  • 3000 చదరపు అడుగులు ఉన్న.. కాశీ విశ్వనాథ ఆలయం ప్రస్తుతం 5 లక్షల చదరపు అడుగులకు విస్తరించింది..
  • ప్రస్తుతం ప్రతి రోజు 50 వేల నుంచి 75000 మంది భక్తులు దర్శించుకునే సౌకర్యం..
  • 2019 మార్చి 9న, కారిడార్ ప్రాజెక్టు శంకుస్థాపన..
  • 2021 డిసెంబర్ 13న, కారిడార్ ప్రారంభించిన ప్రధాని నరేంద్ర మోడీ..
  • అత్యంత వైభవంగా జరిగిన ప్రారంభోత్సవ వేడుకలు..
  • ఈ సందర్భంగా విశ్వనాథ ఆలయం పూర్వ చరిత్ర..

ఆర్సీ న్యూస్, డిసెంబర్ 16 ( వారణాసి): దేశ సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పట్టే విధంగా కాశీ విశ్వనాథ ఆలయం పేరుగాంచింది. తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రమైన కాశీ విశ్వనాథ ఆలయం పునర్నిర్మాణం జరిగి..ఈనెల 13న,భక్తులకు అందుబాటులోకి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొని కాశీ విశ్వనాథ దేవాలయం దేశ నాగరిక వారసత్వానికి గొప్ప ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. 2019 మార్చి 9న, ప్రధాని నరేంద్ర మోడీ వెయ్యి కోట్లతో కాశీ విశ్వనాథ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. దాదాపు రెండేళ్ల లో మొదటి దశ పూర్తయింది. ఔరంగజేబు లాంటి నిరంకుశ పాలకులు కాశీ ని నాశనం చేసేందుకు ప్రయత్నించారని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. గతంలో మూడు వేల చదరపు అడుగులు ఉన్న ఈ ఆలయం ప్రస్తుతం ఐదు లక్షల చదరపు అడుగులకు విస్తరించింది. ప్రతి రోజు 50 వేల నుంచి 75 వేల మంది భక్తులు ఆలయాన్ని దర్శించుకోవడానికి వీలుగా పునర్నిర్మాణం జరిగింది. భక్తుల సౌకర్యార్థం ఎంతో విశాలంగా మారిన కాశీ విశ్వనాథ ఆలయం పూర్వ చరిత్ర తో పాటు అభివృద్ధి…

  • కాశి విశ్వనాథ్ ఆలయం తొమ్మిదవ జ్యోతిర్లింగ క్షేత్రం.
  • కాశీలోని 88 ఘాట్ లలో అత్యంత ప్రసిద్ధి మణికర్ణికా ఘాట్.
  • క్రీ.శ 508 గుప్త చక్రవర్తి వైన్య గుప్తుడిచే ఆలయ నిర్మాణం.
  • క్రీ.శ 635 చైనా యాత్రికుడు యుఆన్ చాంగ్ రచనల్లో కాశీ ప్రస్తావన.
  • క్రీ.శ 1194 ఆలయాన్ని ధ్వంసం చేసిన మహమ్మద్ ఘోరీ సైన్యం.
  • క్రీ.శ 1230 లో ఆలయాన్ని పునర్నిర్మించిన  గుజరాతి వర్తకులు.
  • క్రీ.శ 1489 లో ఆలయ విధ్వంసానికి పాల్పడిన డిల్లీ సుల్తాన్ సికిందర్ లోథి
  • క్రీ.శ 1585 లో ఆలయాన్ని పునర్నిర్మించిన రాజా తొడరమల్
  • క్రీ.శ 1669 లో మొఘల్ చక్రవర్తి ఔరంగజేబు ఆలయ విధ్వంసం
  • క్రీ.శ 1669 లో ఆలయ ప్రాంగణంలోని జ్యోతిర్లింగాన్ని బావిలోకి విసిరేసిన అర్చకుడు.
  • శివలింగాన్ని వేసిన బావికి జ్ఞానవాపి అని పేరు, ఆలయ ప్రాంగణంలోనే దర్శనమిచ్చే జ్ఞానవాపి బావి
  • క్రీ.శ 1669 లో శిథిలమైన ఆలయ గోడలపైనే జ్ఞానవాపి మసీదు నిర్మాణం చేసిన ఔరంగజేబు.
  • క్రీ.శ 1742 లో మసీదు విధ్వంసానికి మల్హర్ రావు హోల్కర్ విఫలయత్నం
  • క్రీ.శ 1780 లో 111 ఏళ్ల తర్వాత కాశీ విశ్వనాథుని కి పూర్వవైభవం.
  • క్రీ.శ 1780 లో నూతన ఆలయాన్ని మరాఠా రాణి అహల్యాబాయి హోల్కర్ జ్ఞానవాపి మసీదు ప్రక్కనే నిర్మించారు.
  • క్రీ.శ 1835 లో స్వర్ణ తాపడం చేయించిన మహారాజా రంజిత్ సింగ్.
  • కాలక్రమంలో గృహ నిర్మాణాలతో ఆక్రమణకు గురైన ఆలయ ప్రాకారం.
  • ప్రతి రోజు జ్యోతిర్లింగ దర్శనంకి తరలి వచ్చే వేలాది భక్తులు చిన్న చిన్న గల్లీలు దాటుకొని ఆలయానికి అసౌకర్యంగా చేరుకునేవారు. 
  • ప్రస్తుతం అలాంటి పరిస్థితి లేదు. స్పేషియెష్ గా తీర్చిదిద్దబడింది.
  • కాశీ పూర్వ వైభవానికి ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ సంకల్పం
  • 184 ఏళ్ల తర్వాత 2019 మార్చి 8 న ప్రధానమంత్రి నరేంద్ర దామోదర్ దాస్ మోడీ 1000 కోట్లతో కాశీ విశ్వనాథ్ ఆలయం పునర్నిర్మాణం కోసం కాశీ విశ్వనాథ్ కారిడార్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది.
  • 12 ఎకరాలలో నూతన కారిడార్ నిర్మాణం.
  • కారిడార్ నిర్మాణం కోసం 300కు పైగా నివాసాలను,1400 వ్యాపార సముదాయాలను తొలగించి ఒక్క కోర్టు కేసు వివాదాలు లేకుండా పరిష్కరించారు.
  • మణికర్ణికా ఘాట్ నుంచి నేరుగా ఆలయానికి చేరుకునే విధంగా నిర్మాణం జరిగింది.
  • కారిడార్ అవతలి వైపు జ్ఞానవాపి మసీదు ఉండేలా డిజైన్ చేశారు.
  • విశ్వనాథుని సన్నిధికి చేరుకునేందుకు సప్త ద్వారాలున్నాయి.
  • ఆలయ ప్రాంగణంలో ఆది శంకరాచార్య, అహల్యాబాయి విగ్రహాలను ఏర్పాటు చేశారు.
  • ఆలయ పునర్నిర్మాణం రెండున్నర సంవత్సరాలలో పూర్తి చేసి రికార్డు సృష్టించిఃది.. ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం.
  • 2021 డిసెంబర్ 13 సోమవారం రోజున భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దివ్య కాశి-భవ్య కాశి కారిడార్ ప్రారంభోత్సవం చేశారు.