మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

విధ్యాసంస్థల ప్రారంభం పై..హైకోర్టులో ఫిల్..

విధ్యాసంస్థల ప్రారంభం పై..హైకోర్టులో ఫిల్..
  • ఏక్ తారీఖ్ సే నహీ ఛాహియే..అంటూ ఫిల్…
  • సెఫ్టెంబర్ 1వ, తేదీ నుంచి విధ్యా సంస్థలు పునఃప్రారంభంపై అభ్యంతరం
  • ప్రభుత్వ ఉత్తర్వులను కొట్టివేయాలంటూ ప్రజా ప్రయోజన వ్యాజ్యం.
  • కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టవద్దని ఫిల్
  • ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేసిన ప్రభుత్వం
  •  కరోనా కట్టడికి చర్యలు తీసుకుంటూనే..కేజీ టు పీజీ క్లాస్ లకు ఆదేశాలు
  •  ఈ నెల 31న విచారణ చేపట్టనున్న హైకోర్టు.

ఆర్సీ న్యూస్, ఆగస్టు 29 (హైదరాబాద్): విద్యాసంస్థల పున:ఫ్రారంభానికి వీలు కల్పించవద్దంటూ ఓ వ్యక్తి హైకోర్టును ఆశ్రయించాడు. కరోనా వైరస్ వ్యాప్తి నేపధ్యంలో విద్యార్థుల ప్రాణాలను పణంగా పెట్టడం సరికాదంటూ  హైదరాబాద్ నగరానికి చెందిన ఎం. బాలక్రిష్ణ అనే వ్యక్తి హైకోర్టులో ఫిల్ దాఖలు చేశారు. కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకోకుండానే సెఫ్టెంబర్ 1వ, తేదీ నుంచి కేజీ టు పీజీ విద్యాసంస్థలను ప్రారంభించాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని ఆయన ధర్మాసానాన్ని కోెరారు. ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేకుండా పాఠశాలలను పున:ప్రారంభించడం సరైంది కాదని ఆయన ప్రజా ప్రయేజన వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ నెల 31న, విచారణ చేపట్టనున్న ధర్మాసనం.

  • అయితే గత ఒకటిన్నర సంవత్సరాలుగా విద్యా సంస్థలు మూత పడడంతో విద్యార్థుల మానసిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోని అన్ని విద్యా సంస్థలను పునఃప్రారంభించడానికి నిశ్చయించింది. 
  • ఇందులో భాగంగా ఈనెల 23వ తేదీన రాష్ట్ర ముఖ్య మంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రగతి భవన్ లో మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్, చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ తో పాటు విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. 
  • సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కేజీ నుంచి పీజీ వరకు విద్యా సంస్థలన్నీ పనిచేయాలని సీఎం కేసీఆర్ విద్యా శాఖ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. 
  • ఇప్పటికే వైద్య, ఆరోగ్య శాఖ, విద్యా శాఖ ఉన్నతాధికారుల నుంచి నివేదికలు తెప్పించుకున్న సీఎం కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
  •  విద్యాసంస్థల అన్నింటిని పునః ప్రారంభించడానికి తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులతో పాటు మంత్రులకు ఆదేశాలు జారీ చేశారు. 
  • దీంతో ఈనెల 24న, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తదితరులు రాష్ట్రంలోని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
  •  సెప్టెంబరు ఒకటో తేదీ నుంచి విద్యా సంస్థలన్నీ పనిచేసేటట్లు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.
  •  సెప్టెంబర్ 1వ తేదీ నుంచి ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్ క్లాసులకు అవకాశం ఇవ్వద్దని సూచించారు. 
  • విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను పాఠశాలలు, కళాశాలలకు పంపించడానికి సిద్ధంగా ఉన్నారని.. ఇందుకోసం ఆయా జిల్లాల కలెక్టర్లు తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రులు కలెక్టర్లను ఆదేశించారు. 
  • విద్యాలయాల్లో విద్యార్థులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. 
  • ఆగస్టు 30వ, తేదీ లోపు రాష్ట్రంలోని అన్ని పాఠశాలను శుభ్రం చేసి విద్యార్థులకు అందుబాటులోకి తేవాలని కోరారు. 
  • ఒక పాఠశాలను ఒక్కో క్లస్టర్ గా భావిస్తూ వైద్య ఆరోగ్య శాఖ నుంచి ఏఎన్ఎం అందుబాటులో ఉంచడానికి చర్యలు తీసుకోవాలన్నారు. 
  • కరోనా కట్టడికి అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటూ.. ప్రతి విద్యార్థి తప్పనిసరిగా మాస్కు ధరించేటట్లు సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయులు జాగ్రత్త వహించాలన్నారు. 
  • మాస్క్ లతో పాటు శానిటైజర్ సైతం వాడేటట్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. 
  • ప్రతి విద్యార్థి స్కూల్కు వచ్చేటట్లు చర్యలు తీసుకోవాలన్నారు. 
  • జీవో నెంబర్ 46 ప్రకారం ఫీజులు మాత్రమే వసూలు చేసేటట్లు తగిన చర్యలు తీసుకుంటామన్నారు.
  •  రాష్ట్రంలో ప్రస్తుతం కరోనా వైరస్ వ్యాప్తి తగ్గిందని.. అందుకే విద్యాసంస్థల పునః ప్రారంభానికి ప్రభుత్వం ఇప్పటికే జీవో జారీ చేసిందని మంత్రులు ఈ నెల 24న నిర్వహించిన జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ లో వివరించారు.
  •  ఎక్కడైనా విద్యార్థులకు జలుబు, జ్వరం వచ్చినట్లయితే వెంటనే కరోనా వైరస్ పరీక్షలు చేయించి తమ తల్లిదండ్రులకు అప్పగించాల్సిన బాధ్యత డి ఈ ఓ లదే నన్నారు. 
  • ఇక ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు ట్రాన్స్ పోర్ట్ విషయంలో తప్పనిసరిగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. 
  • భౌతిక దూరం పాటిస్తూ కరోనా కట్టడికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రైవేటు పాఠశాలలో యాజమాన్యాలపై ఉందన్నారు. 
  • సెప్టెంబర్ 1వ తేదీ నుంచి కేజీ నుంచి పీజీ వరకు విద్యాసంస్థలు అన్ని పని చేస్తున్నందున ఇకనుంచి ఆన్లైన్ క్లాసులు ఉండవన్నారు.
  • ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై హైకోర్టు ఈ నెల 31న విచారణ చేయనుంది.