ఏప్రిల్ 19, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి భక్తి శ్రద్దలతో బంగారు బోనం..

జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి భక్తి శ్రద్దలతో బంగారు బోనం..
  • వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ ప్రత్యేక పూజలు
  • పెద్దమ్మ తల్లికి బంగారు బోనం,పట్టు వస్త్రాల సమర్పణ..
  • లాల్ దర్వాజ నుంచి జూబ్లీహిల్స్ కు ఊరేగింపు..
  • భాజాభజంత్రీల నడుమ పోతురాజుల విన్యాసాలతో కొనసాగిన బంగారు బోనం ఊరేగింపు
  • ఈ నెల 18న, విజయవాడ కనక దుర్గ అమ్మవారికి బంగారు బోనం,పట్టు వస్త్రాలు 

ఆర్సీ న్యూస్,జూలై 16 (హైదరాబాద్): ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలను పుర స్కరించుకుని శుక్రవారం పాతబస్తీ లాల్ దర్వాజలో భక్తుల సందడి నెలకొంది. లాల్ దర్వాజ సింహవాహిణి దేవాలయంలో భక్తులు అమ్మవారికి శుక్రవారం ఉదయం పెద్ద ఎత్తున పూజలు నిర్వహించారు. భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షులు బత్తుల బల్వంత యాదవ్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగాయి. భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పూజలు నిర్వహించారు. 

  • పాతబస్తీ నుంచి భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి ఆధ్వర్యంలో పెద్దమ్మ తల్లి దేవాలయానికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించారు.
  •  ఊరేగింపు కమిటి  ప్రతినిధులు కె.ఎస్.ఆనంద్ రావు, ఆకుల వేణుగోపాల్, మధుసూదన్ యాదవ్, గాజుల అంజయ్య, రాకేశ్ తివారీ, మధుసూదన్ గౌడ్, కె.వెంకటేష్,శీరా రాజ్ కుమార్, అరవింద్ కుమార్ గౌడ్, రాజు యాదవ్, తిరుపతి నర్సింగ్ రావు, ప్యారసాని వెంకటేష్, గాజుల రాహుల్ తదితరుల బ్రుందం పెద్దమ్మ తల్లి  దేవాలయానికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలతో భయలు దేరి వెళ్లారు.
  •  ముందుగా లాల్ దర్వాజ సింహవాహిణీ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బంగారు పాత్రలో బోనంతో పాటు పట్టు వస్త్రాలను తీసుకుని ఊరేగింపుగా బయలు దేరారు. 
  • దారి పొడవు నా పోతరాజుల న్రుత్యాలు, బ్యాండ్ మేళాలతో లాల్ దర్వాజ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున ఊరేగింపు నిర్వహించారు.
  •  అనంతరం అక్కడి నుంచి వాహనాలలో జూబ్లీహిల్స్ చేరుకున్నారు.
  •  జూబ్లీహిల్స్ పెద్దమ్మతల్లి దేవాలయం వద్ద భాజాభజంత్రీల నడుమ పోతురాజుల న్రుత్యాతో ర్యాలీ నిర్వహించి అమ్మవారికి నేవేధ్యం సమర్పించి పట్టు వస్త్రాలు అందజేశారు.
  •  ఆలయ నిర్వాహ కులు పాతబస్తీ నుంచి వచ్చిన బంగారు బోనం ఊరేగింపుకు స్వాగతం పలికారు.

సప్త మాత్రుకల సప్త బంగారు బోనం కార్యక్రమం లో భాగంగా…

  • సప్త మాత్రుకల సప్త బంగారు బోనం కార్యక్రమం లో భాగంగా నగరంలోని అమ్మవార్లకు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీ గా వస్తోంద ఊరేగింపు కమిటి అధ్యక్షులు బత్తుల బల్వంత్ యాదవ్ తెలిపారు.
  •  పెద్దమ్మతల్లి అమ్మవారికి బోనం సమర్పించిన అనంరతం ఆయన విలేకరులతో మాట్లాడుతూ…మొదటి బోనంగా గోల్కోండ జగదాంబ అమ్మవారికి..రెండో బోనంగా బల్కంపేట అమ్మవారికి..మూడో బోనంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి సమర్పించా మన్నారు.
  •  బంగారు బోనం ఊరేగింపు, సమర్పణ సందర్బంగా భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు.
  •  కరోనా వైరస్ కట్టడి చర్యలు పాటిస్తూనే బంగారు బోనం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.
  •  సప్త మాత్రుకల సప్త బంగారు బోనం కార్యక్రమం లో భాగంగా ఈ నెల 18(ఆదివారం)న, విజయవాడ కనక దుర్గ అమ్మవారికి బంగారు బోనం,పట్టు వస్త్రాలు సమర్పించనున్నామన్నారు.
  •  ఇందుకోసం ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిని కలిసి వినితి పత్రం అందజేశామన్నారు.
  •  ఏపీ మంత్రితో పాటు కనక దుర్గ అమ్మవారి దేవాలయం ఈవో, ఆలయ కమిటి చైర్మన్, విజయవాడ నగర పోలీసు కమిషనర్ లను మర్యాద పూర్వకంగా కలిసి ఆంధ్రలో నిర్వహించే  తెలంగాణ బోనాల జాతరకు తగిన ఏర్పాట్లు చేయాలని కోరామన్నారు.
  •  తమ వినతి మేరకు విజయవాడలో నిర్వహించనున్న తెలంగాణ బోనాల జాతరకు ఏపీ ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేస్తోందన్నారు.
  •  విజయవాడలో నిర్వహించే బోనాల జాతర ఉత్సవాలకు పాతబస్తీ నుంచి దాదాపు 200 మంది భక్తులు హాజరు కానున్నారన్నారు. 
  • ఇక ఈ నెల 23న నిర్వహించే కలశ స్థాపనతో పాతబస్తీలో బోనాల జాతర ఉత్సవాలు మొదలవుతాయన్నారు. 
  • కోవిడ్ నిబంధనలు పాటిస్తూ కన్నుల పండువగా బోనాల జాతర ఉత్సవాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేశామన్నారు. 
  • ఈ నెల 25న పాతబస్తీలో నిర్వహించే అమ్మవారి ఘట స్థాపన సామూహిక ఊరేగింపుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
  •  ఊరేగింపు అనంతరం ఆయా దేవాలయాలలో అమ్మవారి ఘట స్థాపన జరుగుతుందని…ఆగస్టు 1వ తేదీన నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు పాతబస్తీలో అమ్మవారికి బోనాల సమర్ఫన కార్యక్రమం ఉంటుందని..2న, పాతబస్తీ వీధుల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు అంగరంగ వైభవంగా జరుగుతుందన్నారు.