మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

నా భక్తులకు అండగా ఉంటా: స్వర్ణలత

నా భక్తులకు అండగా ఉంటా: స్వర్ణలత
  •  ప్రజలందరిని కాపాడాల్సిన భాధ్యత నాది. 
  • నాకు పూజలు చేసిన వారందరిని కాపాడుతాను
  • భక్తుల కోరిన కోరిక మేరకే వర్షాలు..అయినా ఇబ్బదులు లేకుండా చూస్తా..
  • పూజలు చేసి నిరాశ చెంద వద్దు..అందరిని కాపాడే బాధ్యత నాది..
  • సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి దేవాలయంలో స్వర్ణలత భవిష్యవాణి 
  • నేడు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బంగారు బోనం..

 

ఆర్సీ న్యూస్,జూలై 26 (హైదరాబాద్): ‘‘నా భక్తులకు నేను అండగా ఉంటాను..ఎవరు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎన్నోఇబ్బందులను ఓర్చుకుని నాకు పూజలు చేసిన నా భక్తులకు అండగా ఉంటాను. ప్రజలందరిని కాపాడాల్సిన భాధ్యత నాది. నాకు పూజలు చేసిన వారందరిని కాపాడుతాను’’..అంటూ స్వర్ణలత భవిస్యవాణిలో భక్తులకు ధైర్యం చెప్పారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి దేవాలయంలో స్వర్ణలత సోమవారం భవిష్యవాణి తెలిపారు. ఉజ్జయినీ మహాంకాళి దేవాలయంలో ఆదివారం అమ్మవారి బోనాల జాతర ఉత్సవాలు అత్యంత వైభవంగా కన్నుల పండువగా జరిగాయి. భక్తులు తండోప తండాలుగా దేవాలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఆనవాయితీ ప్రకారం బోనాల సమర్పణ మరుసటి రోజు స్వర్ణలత భవిష్యవాణి వినిపిస్తుంది. తరతరాలుగా ఇక్కడ జరిగే భవిష్యవాణికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. అమ్మవారి భక్తులు భవిష్యవాణి కోసం ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తారు. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి దేవాలయంలో ఏళ్ల తరబడి స్వర్ణలత భవిష్యవాణి వినిపొస్తోంది. ఇందులో భాగంగా సోమవారం ఉదయం దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆమెకు నిర్వాహకులు దండలు వేసి ఒడి బియ్యంతో ఘనంగా సత్కరించారు. గట్టి పోలీసు బందోబస్తు నడుమ దేవాాలయానికి చేరుకున్నఆమె భూమిలో ఏర్పాటు చేసిన పచ్చికుండ,చాటపై నిలబడి భవిష్యవాణి వినిపించారు. రాష్ట్రంలో పాడి పంటలు చక్కగా ఉంటాయని..ఎవరూ కరువు కాటకాలతో ఇబ్బందులు పడరని స్వర్ణలత అన్నారు. వర్షాలు కావాలని భక్తులు కోరిన కోరిక మేరకు వర్షాలు కురుస్తున్నాయని..అయితే ఎక్కడ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా తాను చూసుకుంటానన్నారు. 

నేడు చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బంగారు బోనం..

సప్త మాత్రుకల సప్త బంగారు బోనం కార్యక్రమం లో భాగంగా ఈ నెల 27న, చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. ముందుగా లాల్ దర్వాజ సింహవాహిణీ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బంగారు పాత్రలో బోనంతో పాటు పట్టు వస్త్రాలను తీసుకుని చార్మినార్ కు ఊరేగింపుగా బయలు దేరుతారు. దారి పొడవు నా న్రుత్యాలు, బ్యాండ్ మేళాలతో లాల్ దర్వాజ చౌరస్తా వరకు పెద్ద ఎత్తున సామూహిక ఊరేగింపు నిర్వహించనున్నారు. అనంతరం చార్మినార్ దేవాలయం చేరుకుని భాజాభజంత్రీల నడుమ ర్యాలీ నిర్వహించి అమ్మవారికి నైవేధ్యం సమర్పించి పట్టు వస్త్రాలు అందజేయనున్నారు. సప్త మాత్రుకల సప్త బంగారు బోనం కార్యక్రమంలో భాగంగా ఏడుగురు అమ్మవార్లకు ఏడు బంగారు బోనం సమర్పించడం ఆనవాయితీగా వస్తోందని ఊరేగింపు కమిటి అధ్యక్షులు బత్తుల బల్వంత్ యాదవ్ తెలిపారు. మొదటి బంగారు బోనంగా గోల్కోండ జగదాంబ అమ్మవారికి.. రెండో బోనంగా బల్కంపేట అమ్మవారికి.. మూడో బోనంగా జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లికి, నాలుగవ బోనంగా విజయవాడలో కనక దుర్గమ్మ తల్లికి,ఐదో బోనం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు సమర్పించామన్నారు. బంగారు బోనం ఊరేగింపు, సమర్పణ సందర్బంగా భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన ఏర్పాట్లు చేశామన్నారు. కరోనా వైరస్ కట్టడి చర్యలు పాటిస్తూనే బంగారు బోనం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. 

ఆగస్టు 2న,పాతబస్తీ వీధుల్లో ఘనంగా అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు..

ఈ నెల 23న కలశ స్థాపనతో పాతబస్తీలో బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమయ్యాయి.  యదవ్ అన్నారు. అలాగే ఉత్సవాలలో భాగంగా ఈ నెల 25న పాతబస్తీలో అమ్మవారి ఘట స్థాపన సామూహిక ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగింది. ఊరేగింపు అనంతరం ఆయా దేవాలయాలలో అమ్మవారి ఘట స్థాపన జరిగింది. ఆగస్టు 1వ తేదీన నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు పాతబస్తీలో అమ్మవారికి బోనాల సమర్ఫన కార్యక్రమం జరుగుతుంది. అనంతరం ఆగస్టు 2న, పాతబస్తీ వీధుల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది. పాతబస్తీలో గతేడాది కరోనా వైరస్ కారణంగా అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు నిరాడంబరంగా కొనసాగింది. భక్తుల హడావుడి లేకుండా మూసి నది వరకు కొనసాగిన ఊరేగింపు సాదా సీదాగా జరిగింది. ఈసారి అత్యంత వైభవంగా కన్నుల పండువగా నిర్వహించడానికి ఉత్సవాల నిర్వాహకులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేశారు. కళాకారుల ఆటలతో పోతురాజుల విన్యాసాలతో సామూహిక ఊరేగింపు కొనసాగనుందని ఊరేగింపు కమిటి అధ్యక్షులు బత్తుల బల్వంత్ యాదవ్ తెలిపారు.