ఏప్రిల్ 19, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

బోనాల జాతర ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్…

బోనాల జాతర ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్…
  • ఉత్సవాల నిర్వహణకు సీఎం కేసీఆర్ ఆమోదం
  • ఏర్పాట్లు,నిర్వాహణపై ఈ నెల 25న అత్యున్నత స్థాయి సమావేశం
  • బోనాల అభివృద్ది పనుల కోసం రూ.15 కోట్లు కేటాయించడానికి ప్రభుత్వం సిద్దం
  • జూలై 11న, గొల్కొండ జగదాంబ అమ్మవారి బోనంతో ఉత్సవాలు ప్రారంభం
  • ఆగస్టు 1న పాతబస్తీతో పాటు నగరంలో బోనాల జాతర ఉత్సవాలు
  • ఆగస్టు 2న పాతబస్తీలో సామూహిక ఘటాల ఊరేగింపు.

ఆర్సీ న్యూస్,జూన్ 21 (హైదరాబాద్): తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు అనుగుణంగా నిర్వహించే ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ తెలిపింది. ఇందులో భాగంగా బోనాల జాతర ఉత్సవాల నిర్వాహణ, ఏర్పాట్లు తదితర అంశాలపై ఈ నెల 25న మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు సోమవారం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు. దేవాలయాల అభివృద్ది, ఉత్సవాల నిర్వాహణ, ఏర్పాట్ల కోసం రూ.15 కోట్ల నిధులను మంజూరు చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈసారి జరిగే బోనాల జాతర ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తగిన ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారన్నారు.

సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపిన ఉత్సవాల నిర్వాహకులు..

  • ప్రభుత్వం తరఫున బోనాల జాతర ఉత్సవాలకు గ్రీన్ తెలుపుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రకటన వెలువడడం పట్ల ఉత్సవాల నిర్వాహకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
  •  సీఎం కేసీఆర్ తో పాటు మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. ఇక ఈసారి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు భక్తి శ్రద్దలతో ఘనంగా నిర్వహించనున్నట్లు ఉత్సవాల నిర్వాహకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.
  • ఉత్సవాలలో భాగంగానే ఈ నెల 25న, జరిగే సమావేశంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, హోం మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, మంత్రి మల్లారెడ్డి, మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, దేవాదాయ శాఖ కమిషనర్ అనీల్ కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనర్లు అంజనీకుమార్, మహేష్ భగవత్, సజ్జనార్ లతో పాటు వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు పాల్గొని ఈసారి జరిగే బోనాల జాతర ఉత్సవాలను ఎలా నిర్వహించాలి.. కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్త చర్యలు, ఆంక్షలు తదితర అంశాలపై చర్చించనున్నారు.
  • ఈసారి బోనాల జాతర ఉత్సవాలను ఘనంగా నిర్శహించడానికి ఉత్సవాల నిర్వాహకులు ఇప్పటికే తగిన ఏర్పాట్లు చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి వినతి పత్రాలు సమర్పించారు.
  • ఇందులో భాగంగా ఇప్పటికే భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షులు బి.బల్వంత్ యాదవ్ ఆధ్వర్యంలోని ప్రతినిధుల బ్రుందం మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.
  •  ఈసారి బోనాల జాతర ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి ప్రభుత్వం తరఫున తగిన ఏర్పాట్లు చేయాలని మంత్రి తలసాని కోరారు. తమ వినతి మేరకు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సానుకూలంగా స్పందించినట్లు కమిటి అధ్యక్షులు బి.బల్వంత్ యాదవ్, ఉపాధ్యక్షులు కె.ఎస్.ఆనంద్ రావు, వేణు గోపాల్, ప్రధాన కార్యదర్శి ఎం. మధుసూదన్ యాదవ్, కార్యదర్శి గాజుల రాహుల్(గబ్బర్) తదితరులు ఇటీవల తెలిపారు.
  • తాము కోరిన విధంగానే..సోమవారం ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వచ్చిందంటున్నారు.

నగరంలో ఈసారి జరిగే ఆషాడ మాసం బోనాల జాతర వివరాలు..

  • నగరంలో జూలై 11వ తేదీన గోల్కొండ జగదాంబ అమ్మవారికి నిర్వహించే మొదటి బోనంతో ఈసారి ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు ప్రారంభమవుతున్నాయి.
  • జూలై 25న సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారికి బోనాల సమర్పణ
  • అదే రోజు పాతబస్తీలో అమ్మవారి ఘట స్థాపన సామూహిక ఊరేగింపు ఉంటుంది
  • శాలిబండలోని కాశీవిశ్వనాథ్ దేవాలయం నుంచి పాతబస్తీలోని అమ్మవారి ఘట స్థాపన ఊరేగింపు అంగరంగ వైభవంగా కొనసాగుతుంది.
  • ఊరేగింపు అనంతరం ఆయా దేవాలయాలలో అమ్మవారి ఘట స్థాపన జరుగుతుంది.
  • ఆగస్టు 1వ తేదీన నగరంలోని ఇతర ప్రాంతాలతో పాటు పాతబస్తీలో అమ్మవారికి బోనాల సమర్ఫన కార్యక్రమం పెద్ద ఎత్తున భక్తి శ్రద్దలతో జరుగుతుంది.
  • ఆగస్టు 2న, పాతబస్తీ వీధుల్లో అమ్మవారి ఘటాల సామూహిక ఊరేగింపు కొనసాగుతుంది.
  • పాతబస్తీలో నిర్వహించే సామూహిక ఘటాల ఊరేగింపుకు ఎంతో ఆధరణ ఉంది.
  • పాతబస్తీలో నిర్వహించే అమ్మవారి ఘటాల ఊరేగింపును తిలకించడానికి భక్తులు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వస్తారు.
  • రాష్ట్ర ప్రభుత్వం కూడా భక్తుల సౌకర్యార్ధం ఎప్పటికప్పుడు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటుండడంతో భక్తులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు తలెత్తేవి కావు.
  • కరోనా వైరస్ సెకండ్ వేవ్ తగ్గుముఖం పట్టడంతో 2021లో జరిగే ఆషాడ మాసం బోనాల జాతర ఉత్సవాలు కన్నుల పండువగా నిర్వహించడానికి ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయడానికి ముందుకు రావడం పట్ల భాగ్యనగర్ శ్రీ మహాంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటి అధ్యక్షులు బి.బల్వంత్ యాదవ్ సీఎం కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు

గతేడాది కోవిడ్ ఆంక్షల నేపధ్యంలో నిరాడంబరంగా జరిగిన బోనాలు…

  • గతేడాది కోవిడ్ -19 ఆంక్షల నడుమ ఎలాంటి హడావుడి లేకుండా బోనాల జాతర ఉత్సవాలు నిరాడంబరంగా జరిగాయి.
  • భక్తులెవరు లేకుండా ఇళ్లల్లోనే అమ్మవారికి బోనాలను సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడంతో నగరంలోని అన్ని ప్రాంతాలలో భక్తులు ప్రభుత్వ ఆంక్షలను పాటిస్తూ అమ్మవారికి భక్తి శ్రద్దలతో బోనాలను సమర్పించారు.
  • ఆషాడ మాసం మొత్తం నెల రోజుల పాటు బోనాల జాతర ఉత్సవాలు కొనసాగాయి.
  • భక్తులు తమ తమ ఇళ్లల్లోనే అమ్మవారికి బోనాలు సమర్పించినప్పటికీ..దేవాలయ కమిటి ప్రతినిధుల ఆధ్వర్యంలో ఆయా దేవాలయాలలో అమ్మవారికి బోనం సమర్పించారు.
  •  వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ శ్రీ మహంకాళి అమ్మవారికి బోనం సమర్ఫణ పూజా కార్యక్రమాలు జరిగాయి.
  • బోనాల సమర్పణ రోజు భక్తులెవరూ అమ్మవారి దేవాలయాలకు వెళ్ల లేదు.
  • బోనాల సమర్పణ అనంతరం మరుసటి రోజు నిర్వహించే సామూహిక అమ్మవారి ఘటాల ఊరేగింపు సైతం భక్తుల రద్దీ లేకుండానే ముగిసింది.
  •  పరిమిత సంఖ్యలో ఆయా దేవాలయాలకు చెందిన భక్తులు అమ్మవారి ఘటం వెంట నడిచారు.