ఏప్రిల్ 17, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

సెప్టెంబర్లో మళ్లీ లాక్ డౌన్: వక్ఫ్ బోర్డు కమిటి చైర్మన్ మహ్మద్ సలీం

సెప్టెంబర్లో మళ్లీ లాక్ డౌన్: వక్ఫ్ బోర్డు కమిటి చైర్మన్ మహ్మద్ సలీం
  • కరోనా కట్టడికి చర్యలు తీసుకోకపోతే..సెప్టెంబర్లో మళ్లీ లాక్ డౌన్
  • ఈ నెల 21న పండుగ నిర్వహించడానికి ఏర్పాట్లు
  • గతేడాది కరోనా వైరస్ వ్యాప్తితో ఇళ్లల్లోనే ప్రార్ధనలు
  • ఈసారి మసీదులతో పాటు ఈద్గాలలో సామూహిక ప్రార్దనలకు ఏర్పాట్లు
  • మీరాలం ఈద్గాలో ఏర్పాట్లపై ప్రభుత్వ విభాగాల అధికారులతో సమీక్ష సమావేశం
  • వక్ఫ్ బోర్డు కమిటి చైర్మన్ మహ్మద్ సలీం అధ్వర్యంలో ఏర్పాట్ల పరిశీలన
  • జాగ్రత్తలు తీసుకోవాలని కోరిన మహ్మద్ సలీం.

ఆర్సీ న్యూస్,జూలై 17 (హైదరాబాద్): కరోనా కట్టడికి తగిన ముందు జాగ్రత్తలు తీసుకోవాలని వక్ఫ్ బోర్డు కమిటి చైర్మన్ మహ్మద్ సలీం ప్రజలను కోరారు. పండుగల సందర్బంగా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే.. సెప్టెంబర్ నెలలో లాక్ డౌన్ తప్పదన్నారు. రాబోయే బక్రీద్ పండుగను పురస్కరించుకుని ముస్లింలకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడానికి  శనివారం మీరాలం ఈద్గాలో ప్రభుత్వ విభాగాల అధికారులతో మహ్మద్ సలీం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…కరోనా వైరస్ సోకకుండా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మక్కా,మదీనా లలో సైతం సామూహిక ప్రార్ధనల సందర్బంగా రెండు మీటర్ల దూరం పాటిస్తు న్నారన్నారు. రంజాన్ మాసంలో లాగా బక్రీద్ పండుగకు ఈద్గాలలో సామూహిక ప్రార్ధనలకు ఎక్కువ మంది ముస్లింలు రారన్నారు. ఒకవేళ వచ్చినా..ఇళ్లల్లో వజూ చేసుకుని, మాస్క్ లు ధరించి జానిమాజ్ లను వెంట తెచ్చుకుని భౌతిక దూరం పాటించాలన్నారు. పోలీసులు ఎంత వరకు ప్రజలను కట్టడి చేస్తారని..తమంతట తాము కరోనా నుంచి కాపాడు కోవడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. కరోనా కేసులు పెరుగుతున్నందున..లాక్ డౌన్ రావచ్చునని ఆయన అన్నారు. లాక్ డౌన్ వద్దనుకుంటే.. జాగ్రత్తలు తీసుకోవడం ఒక్కటే మార్గమన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కేవలం లాక్ డౌన్ మాత్రమే తొలగిందని..కరోనా వైరస్ ఎక్కడికి పోలేదని..అందరూ అవసరమైన మేరకు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈద్గాలలో ఖాళీ ప్రదేశం చాలా ఉంటుందని సామూహిక ప్రార్ధనలకు ఎలాంటి ఆటంకాలుండ వన్నారు. అయితే సామూహిక ప్రార్ధనలకు హాజరయ్యే ముస్లింలందరూ తప్పనిసరిగా మాస్క్ లు ధరించి భౌతిక దూరం పాటించాలన్నారు. తగిన చర్యలు తీసుకోకపోతే..రాబోయే రోజుల్లో మనమంతా కరోనా వైరస్ బారిన పడే అవకాశాలున్నాయ న్నారు. ఏం కాదులే..అంటూ నిర్లక్ష్యం వహిస్తే…ఆగస్ట్ మాసం తర్వాత లాక్ డౌన్ వచ్చే పరిస్థితులున్నాయన్నారు. ఇప్పటికే ఢిల్లీ,మహారాష్ట్రలో రాత్రిపూట ఆంక్షలు అమలులో ఉన్నాయన్నారు. 

ఈ నెల 21న నిర్వహించే బక్రీద్ పండుగకు తగిన ఏర్పాట్లు…

నగరంలో బక్రీద్ సందడి నెలకొంది. ఈ నెల 21న ముస్లీంలు బక్రీద్ పండుగను జరుపుకోనున్నారు. ఇందు కోసం అసవరమైన అన్ని ఏర్పాట్లు చేసుకోవడంలో ముస్లిం ప్రజలు నిమగ్నమయ్యారు. గతేడాది కరోనా వైరస్ వ్యప్తి కారణంగా బక్రీద్ పండుగను జరుపుకున్నప్పటికీ…ఈద్గాలలో సామూహిక ప్రార్దనలకు ప్రభుత్వం అనుమ తించ లేదు. దీంతో ముస్లీంలు సామూహిక ప్రార్ధనలను తమ తమ ఇళ్లల్లోనే జరుపు కున్నారు. ఐతే ఈసారి రాష్ట్ర ప్రభుత్వం మసీదులతో పాటు ఫవిత్రంగా బావించే ఈద్గాలలో కూడా సామూ హిక ప్రార్ధనలకు అనుమతించడంతో తగిన ఏర్పాట్లు జరుగు తున్నాయి. బక్రీద్ సందర్బంగా ఈద్గాలలో నిర్వహించే సామూహిక ప్రార్ధనలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సంబందిత ఉన్నతాధికారులను ఆదేశించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు వక్ప్ బోర్డు చైర్మన్ మహ్మద్ సలీం శనివారం ప్రభుత్వంలోని వివిధ విభాగాల కు చెందిన అధికారులతో కలిసి పాతబస్తీ మీరాలం ఈద్గా వద్ద సమీక్షా సమావేశం నిర్వహిం చారు. బక్రీదు పండుగకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సంబందిత అధికారులను ఆదేశించారు. ఈ సమావేశంలో ఆరోగ్య శాఖ, జీహెచ్ఎంసీ, జలమండలి, లా అండ్ ఆర్డర్ పోలీసు, ట్రాఫిక్ పోలీసు, రెవెన్యూ, టీఎస్ఎస్పీడీసీఎల్, అగ్నిమాపక విభాగం తదితర విభాగాలకు చెందన అధికారులు పాల్గొన్నారు. పండుగ సందర్బంగా ఈద్గాలో సామూహిక ప్రార్ధనలు నిర్వహించ డానికి వచ్చే ముస్లింలకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుంగా తగిన చర్యలు తీసు కోవాలని మహ్మద్ సలీం అధికారులకు సూచించారు. మంచినీటి సరఫరాలో అంతరాయం లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు. సాంకేతిక కారణాలతో విద్యుత్ సరఫరాలో అంతరాయం కలిగితే వెంటనే పునరుద్దరించడానికి మోబైల్ విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్లు అందుబాటులో ఉంచుకోవాలన్నారు.