ఏప్రిల్ 20, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

20న, బీబీ కా ఆలం ఊరేగింపు..అదే రోజు ప్రభుత్వ సెలవు..

20న, బీబీ కా ఆలం ఊరేగింపు..అదే రోజు ప్రభుత్వ సెలవు..
  • 19న, ఆప్షనల్ సెలవు దినం…
  •  ఈనెల 20న, డబీర్ పురా బీబీ కా ఆలం సామూహిక ఊరేగింపు..
  •  పాతబస్తీ వీధుల్లో అంబారీపై ఆలంతో సామూహిక ఊరేగింపు..
  •  దారి పొడవునా రక్తం చిందించనున్న షియా ముస్లింలు..
  • మతసామరస్యానికి ప్రతీక డబీర్ పురా బీబీ కా ఆలం

 

ఆర్పీ న్యూస్, ఆగస్టు 17 ( హైదరాబాద్): డబీర్ పురా బీబీ కా ఆలం సామూహిక ఊరేగింపు కు అంతా సిద్దమైంది. ఇప్పటికే పాతబస్తీ వీధులలో అంబారీపై బీబీ కా ఆలం ఊరేగింపు రిహార్సల్ నిర్వహించారు. మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకుని ఈనెల 20వ తేదీన డబీర్ పురా బీబీ కా అలావాలోని బీబీ కా ఆలం సామూహిక ఊరేగింపు కొనసాగనుంది. కాగా ముందుగా అనుకున్నట్లు ఈనెల 19వ తేదీన సాధారణ సెలవు దినంగా ప్రకటించిన ప్రభుత్వం దీనిని 20వ తేదీకి మార్చింది. ఇక 19న ఆఫ్షనల్ సెలవుగా..20న సాధారణ సెలవు దినంగా ప్రభుత్వం ప్రకటిస్తూ ఇప్పటికే నోటిఫికేషన్ జారీ చేసింది. 

  • బీబీ కా ఆలం ఊరేగింపు కోసం అవసరమైన ఏర్పాట్లను ఇప్పటికి పూర్తి చేశారు. 
  • రాబోయే శుక్రవారం నిర్వహించే బీబీ కా ఆలం సామూహిక ఊరేగింపు సందర్భంగా అవసరమైన బందోబస్తు చర్యలను తీసుకుంటున్నారు. 
  • డబీర్ పురా నుంచి ప్రారంభమయ్యే సామూహిక ఊరేగింపు యాకుత్పురా దర్వాజా, కోట్ల అలీజా, చార్మినార్, గుల్జార్ హౌస్, మీరాలంమండి, పురాని హవేలీ, దారుల్ షిఫా ద్వారా చాదర్ ఘాట్ వరకు కొనసాగుతుంది. 
  • ఊరేగింపును పురస్కరించుకొని ఆయా రోడ్లలో అవసరం మేరకు సమయాను కూలంగా ట్రాఫిక్ ను దారి మళ్ళించడం జరుగుతుందని సంబందిత ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
  • అంబారీ పై ఊరేగింపు కొనసాగు తుందని…కరోనా కట్టడికి తగిన చర్యలు తీసుకుంటూనే ముస్లింలు మాతంలో పాల్గొనాలని ఇప్పటికే నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ కోరారు. 
  • డబీర్ పురా లోని బీబీ కా అలావా మత సామరస్యానికి ప్రతీకగా నిలుస్తుంది. 
  • కేవలం షియా ముస్లిం ప్రజలే కాకుండా హిందువులు సైతం సందర్శించి బీబీ కా ఆలం లకు పూలు, దట్టీలు సమర్పించి మొక్కులు చెల్లించుకోవడం ఆనవాయితీగా వస్తోంది.
  •  ఇరు వర్గాల ప్రజలు మొక్కలు చెల్లించుకుంటుండడంతో మొహర్రం సంతాపదినాలు మత సామరస్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయి.
  • ఊరేగింపు సందర్భంగా షియా ముస్లింలు దారి పొడవునా మాతం చేస్తూ రక్తం చిందించనున్నారు.
  • హజ్రత్ ఇమామ్ హుస్సేన్ సంస్మరణార్థం నిర్వహించే మొహర్రం సంతాపదినాలు ఈ నెల 11వ తేదీతో ప్రారంభమయ్యాయి.
  •  షియా ముస్లింలు రాబోయే అరవై ఎనిమిది రోజుల పాటు నిర్వహించే సంతాప దినాలలో భాగంగా మొదటి రోజు బుధవారం నుంచి ప్రారంభమైంది. 
  • మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకొని దారుల్ షిఫా లోని అజా ఖానా జాహెరా, మదీనా లోని బాద్ షాహి ఆషుర్ ఖానా, పంజేషా లోని ఖద్మే రసూల్ తదితర ఆషుర్ ఖానా లలో షియా ముస్లిం ప్రజలు మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకొని మాతం, మజ్లీస్ నిర్వహిస్తున్నారు. 
  • నల్లటి దుస్తులు ధరించి ముస్లింలు హజరత్ ఇమామ్ హుస్సేన్ స్మరిస్తూ నిరసనలు తెలియజేస్తున్నారు. 
  • ఆయన మరణాన్ని తాము ఎప్పటికీ జీర్ణించుకోలేని పరిస్థితులు ఉన్నాయని పేర్కొంటూ మజ్లిస్, మాతం నిర్వహిస్తున్నారు. 
  • మొహర్రం సంతాప దినాలను పురస్కరించుకొని డబీర్ పురా లోని బీబీ కా అలావాలో ప్రతిష్టించిన బీబీ కా ఆలం లకు ప్రతి రోజు పలువురు అధికార, అనధికార ప్రముఖులు పూలు దట్టీలు సమర్పిస్తున్నారు. 
  • రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ, ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ , నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్, దక్షిణ మండలం డిసిపి డాక్టర్ గజరావు భూపాల్ తో పాటు మీర్ చౌక్ ఏసీపీ ఆనంద్ తదితరులు బీబీ కా అలావాను సందర్శించి బీబీ కా ఆలంలకు పూలు, దట్టీలు సమర్పించారు. ఈ సందర్భంగా వారు మొక్కులు చెల్లించుకున్నారు.