ఏప్రిల్ 17, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

2BHK-పిల్లిగుడిసెలు రెడీ…

2BHK-పిల్లిగుడిసెలు రెడీ...
  • 1.5 ఎకరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణం..
  • రూ.24.91 కోట్ల వ్యయంతో 2BHK నిర్మాణం
  • 560 చదరపు అడుగుల విస్థీర్ణంలో ఒక్కో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం
  • రెండు బ్లాక్ లలో 9 అంతస్థుల నిర్మాణం.
  • 2016-17 లో ప్రారంభమైన నిర్మాణం పనులు
  • రూ. 8.65 లక్షల వ్యయంతో ఒక్కో డబుల్ బెడ్ రూమ్ నిర్మాణం

 

ఆర్పీ న్యూస్, ఆగస్టు 27 (హైదరాబాద్):  దశాబ్దాలుగా చిన్న చిన్న పూరిల్లలో, రేకుల ఇళ్లలో నివాసమున్న పేద ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ ఇల్లు శనివారం ఉదయం లభించనున్నాయి. ఎంతో ఆతృతగా ఎదురుచూసిన పేద ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ అందనున్నాయి. 2BHK డిగ్నిటీ హౌసింగ్ కాలనీ పేరుతో నిర్మించిన ఇళ్ల ను శనివారం మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించనున్నారు. మలక్ పేట నియోజకవర్గం లోని ఛావునీ  మున్సిపల్ డివిజన్ లో శనివారం ఉదయం 10 గంటలకు పిల్లి గుడిసెలు బస్తీలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల ను ప్రారంభించనున్నారు. నిజాం కాలం నుంచి ఇక్కడ నివాసం ఉంటున్న పిల్లి గుడిసెలు పేద ప్రజలకు ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందనున్నాయి. ఇప్పటికే గుర్తించిన అర్హులైన లబ్ధిదారులకు ఈ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లభించనున్నాయి. చంచల్ గూడా చౌరస్తా వద్ద నిర్మించిన 288 డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి తారక రామారావుతో పాటు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డి, హోం శాఖ మంత్రి మహమ్మద్ మహమూద్ అలీ, రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, హైదరాబాద్ పార్లమెంటు సభ్యులు అసదుద్దీన్ ఓవైసీ, గ్రేటర్ మేయర్ గద్వాల విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలత శోభన్ రెడ్డి, మలక్పేట్ ఎమ్మెల్యే మహమ్మద్ అబ్దుల్లా బిన్ అహ్మద్ బలాల, ఎమ్మెల్సీలు అమీన్ జాఫ్రీ, హాఫంది, వాణి దేవి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరై ఇళ్లు అందజేయనున్నారు. రూ. 24.91 కోట్ల వ్యయంతో తొమ్మిది అంతస్తులలో జిహెచ్ఎంసి ఈ డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను నిర్మించింది. దాదాపు ఒకటిన్నర ఎకరం స్థలంలో  నిర్మాణం పనులు జరిగాయి. రెండు బ్లాక్ లో తొమ్మిది అంతస్తులు నిర్మించారు. ఈ తొమ్మిది అంతస్తుల వరకు లబ్ధిదారులు వెళ్లేందుకు ఐదు లిస్టులను ఏర్పాటు చేశారు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ లో రెండు బ్లాక్ లో 19 కమర్షియల్ షాపులను ఏర్పాటు చేశారు. షాపులను అద్దెకు ఇవ్వడం ద్వారా వచ్చే డబ్బుతో డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నిర్వహణ పనులు, నెల వారి ఖర్చులు వినియోగించనున్నారు. నిజాం కాలం నుంచి తరతరాలుగా పిల్లి గుడిసెలు బస్తీలో పేద ప్రజలు నివాసం ఉంటున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన డబుల్ బెడ్ రూమ్ పథకం లో తమకు కూడా అవకాశం కల్పించాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరడంతో.. వెంటనే అంగీకరించిన ప్రభుత్వం 26-08-2016 న, నిర్మాణ పనుల కోసం నిధులను మంజూరు చేసింది. నిధులు మంజూరు అయిన వెంటనే మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు పిల్లి గుడిసెలు టుబిహెచ్కె శంకుస్థాపన పనులను ప్రారంభించారు. దాదాపు ఐదేళ్లపాటు గృహ నిర్మాణ పనులు కొనసాగి ఎట్టకేలకు పూర్తయ్యాయి. 560 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఒక్కో డబుల్ బెడ్ రూమ్ గృహ నిర్మాణం జరిగింది. ఇందుకోసం రూ. 7.90 లక్షలు నిర్మాణం పనుల కోసం వెచ్చించగా..రూ.0.75 లక్షలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం వినియోగించారు. మొత్తం రూ.8.65 లక్షలు వెచ్చించి ఒక్కో డబుల్ బెడ్ రూమ్ నిర్మించారు. ఈ డబుల్ బెడ్ రూమ్ లను అర్హులైన లబ్ధిదారులకు శనివారం ఉదయం అందించనున్నారు. ఇప్పటికే మంచినీటి సౌకర్యం కోసం 100 KL సంపును నిర్మించారు. సి సి రోడ్డు తో పాటు విద్యుదీకరణ పనులు పూర్తయ్యాయి. అన్ని మౌలిక సదుపాయాలతో ఇక్కడి డబుల్ బెడ్ రూమ్ లను పూర్తి చేసిన ప్రభుత్వం శనివారం నిర్వహించనున్న ప్రారంభోత్సవ కార్యక్రమం సందర్భంగా లబ్ధిదారులకు అందజేయనున్నారు. జీహెచ్ ఎంసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిర్మాణం పనులు నత్తనడకన కొనసాగినప్పటికీ.. ఎట్టకేలకు పేద ప్రజలకు అందుతుండటంతో లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్ నగరాన్ని సుందర నగరంగా తీర్చిదిద్దడం తో పాటు మురికివాడలు లేని నగరంగా మార్చడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నగరంలోని పలు ప్రాంతాల్లో ఇప్పటికే డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మించి అర్హులైన లబ్ధిదారులకు అందజేసింది. ఇందులో భాగంగా మలక్పేట్ నియోజకవర్గం లోని పిల్లి గుడిసెల బస్తీలో టుబిహెచ్కె డిగ్నిటీ హౌసింగ్ కాలనీ నిర్మించింది. ఈనెల 28 న, ప్రారంభించనున్న టుబిహెచ్కె హౌసింగ్ స్కీమ్ సందర్భంగా సంబంధిత అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు. ప్రారంభోత్సవం సందర్భంగా ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా జిహెచ్ఎంసి, రెవెన్యూ, పోలీసు అధికారులు తగిన ఏర్పాట్లు చేశారు.బహిరంగ మార్కెట్లో ఒక్కో 2BHK ఖరీదు రూ. 40 లక్షలకు పైగా ఉంటుందని సంబంధిత అధికారులు చెబుతున్నారు.