మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఈ నెల 19 తర్వాతే..చారిత్రక కట్టడాల సందర్శన షురూ..

ఈ నెల 19 తర్వాతే..చారిత్రక కట్టడాల సందర్శన షురూ..

 

  • పురాతన కట్టడాలు,మ్యూజియంల సందర్శనకు ఓకే చెప్పిన ఏఎస్ఐ..
  • నేటితో ముగుస్తున్నఏఎస్ఐ ఆంక్షలు…
  • ఐనా..రాష్ట్రంలో ఈ నెల 19 వరకు లాక్ డౌన్ ఆంక్షల అమలు
  • దీంతో 19 తర్వాతే సందర్శనకు అందుబాటులోకి రానున్న చార్మినార్,గోల్కోండ,సాలార్జంగ్ మ్యూజియం

ఆర్సీ న్యూస్,జూన్ 15 (హైదరాబాద్): పురాతన కట్టడాలు,మ్యూజియంలను బుధవారం నుంచి సందర్శనకు అందుబాటులోకి రావాల్సి ఉన్నప్పటికీ..రాష్ట్రంలో ఈ నెల 19 వరకు లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉండడంతో సందర్శన వీలు పడడం లేదని సంబందిత అధికారులు చెబుతున్నారు. ఏఎస్ఐ ఆదేశాల ప్రకారం బుధవారం నుంచి సందర్శన అందుబాటులోకి రావాల్సి ఉంది. దాదాపు రెండు నెలల పాటు రాష్ట్రంలోని పురాతన కట్టడాలు,మ్యూజియంలను మూసి ఉంచారు. కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సందర్శన నిలిచి పోయింది. బుధవారం నుంచి సందర్శించడానికి సందర్శకులకు అనుమతి దొరుకుతుందని భావించిన పర్యాటకులకు నిరాశే ఎదురవుతోంది. కరోనా వైరస్ తో పాటు లాక్ డౌన్ ఆంక్షల నేపథ్యంలో రాష్ట్రంలో ఏఎస్ఐ ఆంక్షలు ఈ నెల 15 వ తేదీ వరకు కొనసాగాయి. ఈ నెల 15 వ తేదీతో గతంలో విధించిన ఆంక్షల గడువు ముగిసింది. దీంతో బుధవారం నుంచి రాష్ట్రంలోని పురాతన కట్టడాలు, మ్యూజియంల సందర్శన తిరిగి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో ఈ నెల 19 వరకు లాక్ డౌన్ ఆంక్షలు కొనసాగుతుండడంతో..పురాతన కట్టడాలు,మ్యూజియంలను అప్పటి వరకు మూసి ఉంచాల్సిందేనని సంబందిత అధికారులు చెబుతున్నారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) సోమవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ..ఈ నెల 16వ తేదీ నుంచి సందర్శన అందుబాటులోకి వస్తున్నట్లు తెలిపింది. ఈ ఆదేశాల ప్రకారం బుధవారం నుంచి పర్యాటకులను అనుమతించాల్సి ఉంది. రాష్ట్రంలో పరిస్థితులు వేరుగా ఉండడంతో వీలు పడదని అధికారులు అంటున్నారు. ఈ నెల 19 తర్వాత పరిస్థితులు ఏవిటనే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేయనుందని చెబుతున్నారు. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల ప్రాభావంతో్  పురాతన కట్టడాలు, మ్యూజియంలను ఈ నెల 15 వరకు పొడిగించినట్లు గతంలో ప్రకటించారు. ఇప్పటికే ఏఎస్ఐ పరిధిలోని అన్ని పురాతన కట్టడాలు, మ్యూజియంలను మొదటి దఫా కింద  ఏప్రిల్ 16వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు ఆంక్షలు విధించింది..మళ్లీ మే 31వ తేదీ వరకు పొడిగిస్తూ ఏఎస్ఐ ఆదేశాలు జారీ చేసింది. దీంతో 31వ తేదీతో రెండో దఫా ఆంక్షల గడువు ముగియడంతో తిరిగి మరో 15 రోజుల పాటు వీటిని మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో జూన్ 15వ తేదీ వరకు రాష్ట్రంలో ఆంక్షలు కొనసాగాయి. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పగటిపూట లాక్ డౌన్ ను ఎత్తివేసినప్పటకీ..రాత్రిపూట లాక్ డౌన్ కొనసాగుతోంది. దీంతో ఏఎస్ఐ ఆధీనంలోని కట్టడాలు,మ్యూజియంల సందర్శన కూడా నిలిచిపోయింది.   ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని గోల్కొండ,చార్మినార్,సాలార్ జంగ్ మ్యూజియం లతో పాటు జోగులాంబ గద్వాల జిల్లాలోని  ఆలంపూర్ టెంపుల్, వరంగల్ లోని రామప్ప దేవాలయం, వరంగల్ కోట తదితర పర్యాటక ప్రాంతాలన్నింటినీ జూన్ 15 వరకు మూసి వేశారు. పగటిపూట లాక్ డౌన్ ను  ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సడలింపు కొనసాగుతోంది. ఏప్రిల్ 16వ తేదీ నుంచి మొదటి దఫా వచ్చిన ఆదేశాల ప్రకారం నగరంలోని చార్మినార్,సాలార్ జంగ్ మ్యూజియం, గోల్కొండ కోటను మూసి వేశారు. సందర్శకులను ఎవరినీ అనుమతించడం లేదు. ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు గతంలో కన్నాగణనీయంగా తగ్గుముఖం పడుతున్నప్పటికీ..రాత్రిపూట లాక్ డౌన్ కొనసాగుతుండడంతో పర్యాటక ప్రాంతాల సందర్శన నిలిపి వేయడం బెటర్ అని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తొంది. ఈ నెల 19 వరకు లాక్ డౌన్ ఆంక్షలు అమలులో ఉండడంతో.. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) సందర్శనకు అనుమతించినప్పటికీ..రాష్ట్రంలో వీలు పడదని అంటున్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన మేరకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉంటుండడంతో..పాజిటివ్ కేసుల సంఖ్య  తగ్గుముఖం పడుతోంది. దేశంలో కరోనా పాజిటివ్ కేసుల పరిస్థితిని ద్రుష్టిలో ఉంచుకుని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పురాతన కట్టడాల సందర్శనకు ఈ నెల 16 నుంచి అనుమతించింది. అయితే ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతి వచ్చినప్పుడే.. నగరంలో చారిత్రాత్మకమైన చార్మినార్ కట్టడంతో పాటు సాలార్జంగ్ మ్యూజియం,గోల్కొండ కట్టడాలు పర్యాటకుల సందర్శనకు అందుబాటులోకి వస్తాయి. ఇక పాతనగరంలోని మరో చారిత్రాత్మకమైన మక్కా మసీదు కట్టడం లోనికి ఏప్రిల్ నెల మొదటి నుంచే విజిటర్స్ ను అనుమతించడం లేదు.