మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

తెలంగాణలో రాత్రిపూట కరోనాకర్ప్యూ విధింపు..

తెలంగాణలో రాత్రిపూట, కరోనాకర్ప్యూ
  1. ఆర్సీ న్యూస్(హైదరాబాద్): తెలంగాణలో రాత్రిపూట కరోనాకర్ప్యూ అమలు లోకి వచ్చింది. రాత్రి 9 గంటల నుంచి తెల్లవారు జామున 5 గంటల వరకు కరోనా కర్ప్యూ అమలులో ఉంటుంది. ఈ నెల 20 వ తేదీ రాత్రి 9 గంటల నుంచి మే 1 వ తేదీ తెల్లవారు జామున 5 గంటల వరకు అమలులో ఉంటుంది. అత్యవసర సేవలను ఈ కరోనా కర్ప్యూ నుంచి మినహాయింపు ఇస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రజలు సంబందిత విధినిర్వాహణలోని అధికారులు, సిబ్బందితో సహకరించాలని కోరింది. ప్రజా ఆరోగ్యం ద్రుష్ట్యా రాత్రిపూట కరోనాకర్ప్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. 
  • కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతోంది. కరోనా కట్టడికి తీసుకోవాల్సిన ముందు జాగ్రత్తల పట్ల కొంత మంది ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తు న్నారు. దీంతో కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నాయి. 
  • మాస్క్ ధరిస్తూ ప్రతి ఒక్కరూ భౌతిక దూరం పాటించాల్సి ఉండగా పట్టించుకోవడం లేదు.
  •  కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు తగిన మార్గ దర్శకాలు జారీ చేస్తున్నప్పటికీ..ఆచరణలో సాధ్యం కావడం లేదు. అందుకే పోలీసులు రంగంలోకి దిగి నిర్లక్ష్యంగా ఉన్న వారిని కట్టడి చేసే ప్రయత్నం చేశారు. 
  • మాస్క్ లు ధరించకపోతే..రూ. 1000 జరిమాన విధించారు.  లా అండ్ ఆర్డర్ పోలీసులు స్థానికులతో పాటు వ్యాపారులకు కౌన్సిలింగ్ ఇచ్చారు. 
  • జనరల్ స్టోర్స్ నిర్వహకులకు తప్పని సరిగా శానిటైజర్స్ వినియోగించాలని సూచించారు. వస్తువులు వినియోగ దారులకు ఇచ్చిన వెంటనే చేతులను శానిటైజర్ తో శుభ్రం చేసుకోవాలని సూచించారు. 
  • అయినప్పటికీ..ఎక్కడా కరోనా వైరస్ వ్యాప్తి తగ్గ లేదు. 
  • రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసలు పెరుగుతూనే ఉన్నాయి.
  •  దీంతో హైకోర్టు జోక్యం చేసుకుంది. రాష్ట్రంలో కరోనా వైరస్ రోజు రోజుకు పెరుగుతుండగా…రాష్ట్ర ప్రభుత్వం కరోనా కట్టడికి ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు తెలియ జేయాలని..హైకోర్టు కోరింది.
  •  కరోనా కట్టడికి అవసరమైన మేరకు తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవడం లేదంటూ రాష్ట్ర ప్రభుత్వంపై అసహనం వ్యక్తం చేసింది.
  • ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారో తెలియజేయాలని ఆదేశించింది. 
  • కరోనా కట్టడికి న్యూ ఢిల్లీ ప్రభుత్వం లాక్ డౌన్ విధించింది. ఇక్కడ మాత్రం కరోనా కట్టడికి చర్యలు తీసుకోవడం లేదు..ఇదేంటి..? అని ప్రశ్నించింది.  
  • కుంభమేళాలో పాల్గొన్న వారు ఇక్కడికి వస్తున్నారు..మీరు ఎలాంటి ముందస్తు చర్యలు తీసుకుంటున్నారని నిలదీసింది. 
  • కరోనాకర్ఫ్యూ , లాక్ డౌన్ విధించడానికి  రాబోయే 48 గంటల్లో కోర్టుకు తెలియజేయాలని ఆదేశాలు జారీ చేసింది.
  •  ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే..కోర్టు స్పందించి ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాల్సి ఉంటుందని స్పష్టం చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం 24 గంటల్లోనే స్పందించింది.
  •  మంగళవారం రాత్రి 9 గంటల నుంచి నైట్ కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రకటించింది. 
  • పబ్ లు, వైన్ షాప్ లు, సినిమా థియేటర్లు, రెస్టారెంట్లు, బార్లు, ప్రజలు బయట తిరగడం..అన్నీ బంద్. 
  • సాధారణ ప్రజలకు ఎవరికీ మినహాయింపు లేదు. 
  • మీడియా, పెట్రోల్ బంకులు, సీఎన్జీ, ఎల్పీజీ, పవర్ జనరేషన్ డిస్ట్రీబ్యూషన్, ప్రైవేట్ సెక్యూరిటీ సర్వీస్, ప్రొడక్షన్ యూనిట్ సర్వీసెన్, ఇంటర్నెట్ సర్వీసెస్, కేబుల్ టీవీ సర్వీసెస్, డిష్ టీవీ సర్వీసెస్, ఐటీ కంపెనీస్, ఐటీ సర్వీసెస్లకు అనుమతి ఉంది.
  •  వీరందరూ తగిన ఐడెంటి కార్డులను తమ వెంట ఉంచుకోవాల్సి ఉంటుంది.
  •  అలాగే అత్యవసర సేవలకు హాజరయ్యేందుకు వెళ్లే వారి సౌకర్యార్థం ఆటో రిక్షాలు, క్యాబ్ లను అనుమతిస్తారు. 
  • ప్రయాణికల రాకపోకల విషయంలో సంబంధిత ట్రావెలింగ్ టికెట్లు చూపిస్తే..కార్లు, ఆటోలలో ప్రయాణానికి అనుమతిస్తారు. 
  • మెడికల్ షాపులు, ఆసుపత్రులు, గ్యాస్ సరఫరా, పాల సరఫరా, న్యూస్ పేపర్ సరఫరా, అత్యవసర ఫుడ్ డెలివరీ తదితర అత్యవసర సేవలకు అనుమతి ఉంటుంది.