మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

పగటిపూట లాక్ డౌన్ తొలగింపు..కొనసాగనున్న రాత్రిపూట ఆంక్షలు

పగటిపూట లాక్ డౌన్ తొలగింపు..కొనసాగనున్న రాత్రిపూట ఆంక్షలు
  •  సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగిన కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం
  • ఈ నెల 10 నుంచి పగటిపూట లాక్ డౌన్ సడలింపు…
  • రాత్రిపూట ఆంక్షలు కొనసాగింపు..
  • ఉదయం 6 నుంచి సాయంత్రం 5 వరకు సడలింపు..
  • ఇళ్లకు వెళ్లడానికి మరో అదనపు గంటతో సాయంత్రం 6 గంటల వరకు సడలింపు..
  • సాయంత్రం 6 నుంచి ఉదయం 6 వరకు అమలులో లాక్ డౌన్
  • 7 నియోజక వర్గాలలో మధ్యాహ్నం 2 గంటల వరకే సడలింపు…
  • ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఇక పగటిపూట లాక్ డౌన్ తొలగింపు..అంటూ ఆర్సీ న్యూస్ ఈ నెల 6వ తేదీనే పాఠకులకు సమాచారాన్నిఅందించింది.
  • 15 రోజుల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తి చేయాలి.

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): రాష్ట్రంలో పగటిపూట లాక్ డౌన్ ను తొలగిస్తూ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. మరో పది రోజుల పాటు రాత్రిపూట లాక్ డౌన్ కొనసాగనుంది. ప్రస్తుతం ఈ నెల 9వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉన్న విషయం తెలిసిందే. బుధవారంతో లాక్ డౌన్ గడువు ముగుస్తున్నందున ఒక రోజు ముందు అంటే 8వ తేదీన సీఎం కేసీఆర్ అధ్యక్షతన కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో మరో పది రోజుల పాటు రాత్రిపూట మాత్రమే లాక్ డౌన్ ను అమలు చేస్తూ..పగటిపూట లాక్ డౌన్ ను ఎత్తివేస్తూ మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అయితే కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పట్టని సత్తుపల్లి, మధిర, నల్గొండ, నాగార్జున సాగర్, దేవరకొండ, మునుగోడు, మిర్యాలగూడ తదితర 7 నియోజక వర్గాలలో ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు మాత్రమే లాక్ డౌన్ సడలింపు ఉంటుంది. 15 రోజుల్లో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తి చేయాలని రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.

  •  ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లాక్ డౌన్ తొలగించి సడలింపులు ఇస్తూ…తిరిగి సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ అమలు చేయనున్నట్లు మంత్రి వర్గం నిర్ణయించింది.
  •  ప్రభుత్వ కార్యాలయాలు సాయంత్రం 5 గంటల వరకు పని చేస్తుండగా..ఉద్యోగులు తమ తమ ఇళ్లకు వెళ్లడానికి మరో గంట అదనంగా సమయం కేటాయించడంతో..సాయంత్రం 6 గంటల వరకు లాక్ డౌన్ తొలగింపు ఉంటుంది.
  •  పగటిపూట లాక్ డౌన్ తొలగిస్తే..అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందనే అంశాన్ని రాష్ట్ర మంత్రి వర్గం పరిశీలించింది.
  •  గత 24 గంటల్లో రాష్ట్రంలో రెండు వేల లోపు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి.
  • గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇక పగటి పూట లాక్ డౌన్ ను తొలగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
  • ఇప్పటికే రెండు వారాలుగా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతున్న విషయాన్ని ప్రజారోగ్య శాఖ ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ కు నివేదికలు అందజేసింది.
  •   అంతేకాకుండా ఇప్పటికే జూన్ నెలాఖరు వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడతాయని గత నెల లోనే ప్రజారోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదిక అందించింది.
  •  నివేదికల ఆధారంగా ప్రతి రోజు విడుదల చేస్తున్న మీడియా బులిటెన్ ను పరిశీలిస్తే…రోజు రోజుకు కేసుల సంఖ్య తగ్గుతోంది.
  • కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తగ్గుదలతో పాటు లాక్ డౌన్ కారణంగా అన్ని వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న మంత్రి వర్గం..ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగుతున్న లాక్ డౌన్ అనంతరం 10వ తేదీ నుంచి పగటిపూట అమలు చేయవద్దని నిర్ణయించింది.
  • లాక్ డౌన్ పొడిగిస్తే..ఆర్థిక సమస్యలు తలెత్తుతున్న సందర్భంగా పగటి పూట కాకుండా రాత్రిపూట అమలు చేస్తే బాగుంటుందనే అంశాన్ని పరిశీలించింది.
  • ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు,రైతులు లాక్ డౌన్ తో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.
  • ఈ మేరకు ఈ నెల 8వ తేదీన సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కరోనా వైరస్ వ్యాప్తి, వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ అమలు తీరు, లాక్ డౌన్ పొడిగింపు తదితర అంశాలతో పాటు ఇతర అంశాలను కూడా చర్చించింది.
  • ప్రస్తుతం జూన్ 9వ తేదీ వరకు లాక్ డౌన్ అమలులో ఉంటుంది.
  • అంతకు ముందు వరకు ఉన్న 4 గంటల సడలింపు సమయం.. మే 31వ తేదీ నుంచి 7 గంటల వరకు అమల్లోకి వచ్చింది. అంతే కాకుండా ఇళ్లకు చేరడానికి మరో గంట అదనం గా అందుబాటులో ఉంది.
  • ప్రస్తుతం ప్రతి రోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట సమయం వరకు సడలింపు ఉండగా..మరో గంట పాటు అదనంగా కేటాయించడంతో మధ్యాహ్నం 2 గంటల వరకు సడలింపు అందుబాటులో ఉంది.
  • రోజు వారి కూలి పనులు చేసుకునే వారితో పాటు రోజంతా కష్టపడి వివిధ పనులు చేసే వారికి ఈ 7 గంటల సడలింపు సమయం సరిపోవడం లేదని ఫిర్యాదు లున్నాయి.
  • మొదటగా రాష్ట్రంలో ఈ నెల 12వ తేదీ నుంచి 22వ తేదీ వరకు లాక్ డౌన్ విధించిన ప్రభుత్వం..రెండో దఫా మే 30వ తేదీ వరకు..మూడో దఫా గా జూన్ 9వ తేదీ వరకు మరో మారు లాక్ డౌన్ ను పెంచుతూ నిర్ఱయం తీసుకుంది.
  • లాక్ డౌన్ కు ముందు కరోనా పాజిటివ్ కేసులు అధికంగా ఉన్నాయని రాష్ట్ర ప్రభుత్వం భావించింది.
  •  ప్రస్తుతం ఈ నెల 8వ తేదీ సాయంత్రం 5.30 గంటల వరకు రాష్ట్రంలో 1897 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు  వైద్య,ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు స్పష్టం చేశారు.
  • లాక్ డౌన్ విధించడంతో పాటు ప్రజలు కరోనా కట్టడికి సరైన జాగ్రత్తలు తీసుకుంటుండడంతో పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుతోందంటున్నారు.
ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఇక పగటిపూట లాక్ డౌన్ తొలగింపు
ముందే చెప్పిన ఆర్సీ న్యూస్.

ఇప్పటి వరకు రాష్ట్రంలో అమలు జరుగుతున్న ఆంక్షల వివరాలు…..

  • రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతుండటంతో హైకోర్టు జోక్యంతో తెలంగాణలో ముందు ఏప్రిల్ 20వ తేదీ నుంచి రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రాత్రిపూట కరోనా కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.
  •  మొదటగా మే 1 వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు అమల్లోకి రాగా..మరో వారం రోజుల పాటు అంటే..గత నెల 8వ తేదీ వరకు పొడిగించారు. 8వ తేదీ తెల్లవారుజాముతో రెండో వారం వరకు పొడిగించిన రాత్రిపూట కర్ఫ్యూ గడువు ముగుస్తుందనగా..ఒకరోజు ముందు అంటే 7వ తేదీన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాత్రిపూట కర్ఫ్యూ మరో వారం రోజుల పాటు అంటే మే 15వ తేదీ వరకు  పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
  •  రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుండగానే మరోసారి హైకోర్టు జోక్యంతో రాత్రిపూట కర్ఫ్యూ ముగియడానికి రెండు రోజులు ముందుగానే మే 12 నుంచి లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించి అమలు చేస్తోంది.
  •  ప్రస్తుతం అమలు జరుగుతున్న లాక్ డౌన్ మే 30తో ముగియనుండడంతో మరోసారి ప్రగతి భవన్ లో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో లాక్ డౌన్ ను జూన్ 9వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ఱయం తీసుకున్నారు.
  • దీంతో ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగుతున్న లాక్ డౌన్ సందర్భంగా పాజిటివ్ కేసులు 2 వేల లోపు పడిపోవడంతో…10వ తేదీ నుంచి పగటిపూట లాక్ డౌన్ ను తొలగించింది.
  • ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు ఇక పగటిపూట లాక్ డౌన్ తొలగింపు..అంటూ ఆర్సీ న్యూస్ ఈ నెల 6వ తేదీనే పాఠకులకు సమాచారాన్ని అందించింది.