మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

లాక్ డౌన్ తొలగింపు..రేపటి నుంచి ఎలాంటి ఆంక్షలుండవు

లాక్ డౌన్ తొలగింపు..రేపటి నుంచి ఎలాంటి ఆంక్షలుండవు
  •  సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో జరిగిన కేబినెట్ మీటింగ్ లో నిర్ణయం
  • జూలై 1వ తేదీ నుంచి స్కూల్స్,కాలేజీలు ప్రారంభం.
  • ఈ నెల 20వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఎలాంటి ఆంక్షలు లేవు
  • రేపటి ఉదయం 6 గంటల వరకు అమలులో లాక్ డౌన్ ఆంక్షలు

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): రాష్ట్రంలో ఈ నెల 20వ తేదీ నుంచి లాక్ డౌన్ ను పూర్తిగా తొలగిస్తూ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ఈ నెల 19వ తేదీ వరకు అమలులో ఉన్న విషయం తెలిసిందే. ఆదివారం ఉదయం 6 గంటలతో లాక్ డౌన్ గడువు ముగుస్తున్నందున శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ మీటింగ్ జరిగింది. ఈ సమావేశంలో 20వ తేదీ ఉదయం 6 గంటల నుంచి  పూర్తిగా ఎత్తివేస్తూ మంత్రి వర్గం కీలక నిర్ణయం తీసుకుంది. అలాగే జూలై 1వ తేదీ నుంచి స్కూల్స్,కాలేజీలను కూడా తెరవడానికి మంత్రి వర్గం నిర్ణయించింది.

  • గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో ఇక లాక్ డౌన్ ను తొలగిస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
  • ఇప్పటికే రెండు వారాలుగా రాష్ట్రంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతున్న విషయాన్ని ప్రజారోగ్య శాఖ ఎప్పటికప్పుడు సీఎం కేసీఆర్ కు నివేదికలు అందజేసింది.
  • అంతేకాకుండా ఇప్పటికే జూన్ నెలాఖరు వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడతాయని గత నెల లోనే ప్రజారోగ్య శాఖ ప్రభుత్వానికి నివేదిక అందించింది.
  •  నివేదికల ఆధారంగా ప్రతి రోజు విడుదల చేస్తున్న మీడియా బులిటెన్ ను పరిశీలిస్తే…రోజు రోజుకు కేసుల సంఖ్య తగ్గుతోంది.
  • కరోనా వైరస్ పాజిటివ్ కేసుల తగ్గుదలతో పాటు లాక్ డౌన్ కారణంగా అన్ని వర్గాల ప్రజలు పడుతున్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న మంత్రి వర్గం..లాక్ డౌన్ ను ఎత్తి వేసింది.
  • లాక్ డౌన్ పొడిగిస్తే..ఆర్థిక సమస్యలు తలెత్తుతాయనే విషయం మంత్రి వర్గం చర్చించింది.
  • ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలు,రైతులు లాక్ డౌన్ తో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకు వచ్చిన విషయం తెలిసిందే.
  • ఈ మేరకు శనివారం సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్ లో కరోనా వైరస్ వ్యాప్తి, వైరస్ కట్టడికి తీసుకుంటున్న చర్యలు, లాక్ డౌన్ పొడిగింపు,వానాకాలం, వర్షాల ఆదారిత పంటలు, వ్యవసాయం తదితర అంశాలతో పాటు ఇతర అంశాలను కూడా చర్చించింది.

 రాష్ట్రంలో అమలు జరిగిన సెకండ్ వేవ్ లాక్ డౌన్ ఆంక్షల వివరాలు…..

  • రాష్ట్రంలో మొదట్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు అధికంగా నమోదవుతుండటంతో హైకోర్టు జోక్యంతో తెలంగాణలో ముందు ఏప్రిల్ 20వ తేదీ నుంచి రాత్రి 9 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు రాత్రిపూట కరోనా కర్ఫ్యూ అమల్లోకి వచ్చింది.
  • మొదటగా మే 1 వ తేదీ తెల్లవారుజామున 5 గంటల వరకు అమల్లోకి రాగా..మరో వారం రోజుల పాటు అంటే..గత నెల 8వ తేదీ వరకు పొడిగించారు. 8వ తేదీ తెల్లవారుజాముతో రెండో వారం వరకు పొడిగించిన రాత్రిపూట కర్ఫ్యూ గడువు ముగుస్తుందనగా..ఒకరోజు ముందు అంటే 7వ తేదీన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ రాత్రిపూట కర్ఫ్యూ మరో వారం రోజుల పాటు అంటే మే 15వ తేదీ వరకు  పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
  •  రాత్రిపూట కర్ఫ్యూ కొనసాగుతుండగానే మరోసారి హైకోర్టు జోక్యంతో రాత్రిపూట కర్ఫ్యూ ముగియడానికి రెండు రోజులు ముందుగానే మే 12 నుంచి లాక్ డౌన్ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించి అమలు చేసింది.
  •  మే 30వ తేదీతో ముగియనుండడంతో మరోసారి ప్రగతి భవన్ లో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో లాక్ డౌన్ ను జూన్ 9వ తేదీ వరకు పొడిగిస్తూ నిర్ఱయం తీసుకున్నారు.
  • దీంతో ఈ నెల 9వ తేదీ వరకు కొనసాగిన కర్ఫ్యూ సందర్భంగా పాజిటివ్ కేసులు 2 వేల లోపు పడిపోవడంతో…10వ తేదీ నుంచి పగటిపూట లాక్ డౌన్ ను తొలగించింది.
  • ఈ నెల 19వ తేదీ వరకు ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు పగటిపూట  తొలగించి..కేవలం రాత్రిపూట లాక్ డౌన్ ను కొనసాగించింది.
  • ఆదివారం ఉదయం 6 గంటల వరకు లాక్ డౌన్ రాత్రిపూట ఆంక్షలు అమలులో ఉంటాయి.
  • 20వ తేదీ (ఆదివారం) ఉదయం 6 గంటల నుంచి రాష్ట్రంలో ఎలాంటి ఆంక్షలు ఉండవు