మార్చి 29, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఈ నెలాఖరు వరకు పర్యాటక ప్రాంతాల సందర్శన క్లోజ్డ్…

ఈ నెలాఖరు వరకు పర్యాటక ప్రాంతాల సందర్శన క్లోజ్డ్…

చార్మినార్

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): పురాతన కట్టడాలు,మ్యూజియం మూసివేత తిరిగి ఈ నెలాఖరు వరకు కొనసాగుతోంది. ఈ నెల 31 వరకు వీటిని మూసి ఉంచుతున్నట్లు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా(ఏఎస్ఐ) వెల్లడించింది. దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో పురాతన కట్టడాలు, మ్యూజియంలను మే 31వ తేదీ వరకు మూసివేస్తున్నట్లు ఏఎస్ఐ ప్రకటించింది.ఇప్పటికే ఏఎస్ఐ పరిధిలోని అన్ని పురాతన కట్టడాలు,మ్యూజియంలను ఏప్రిల్ 16వ తేదీ నుంచి మే 15వ తేదీ వరకు క్లోజ్ చేశారు.శనివారం తో మొదటి దఫా ఇచ్చిన ఆంక్షలు ముగిసాయి. దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి పరిస్థితి ఇంకా తగ్గుముఖం పట్టకపోవడంతో తిరిగి ఆంక్షలను మే 31వ తేదీ వరకు పొడిగించారు. 

  •  ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు హైదరాబాద్ లోని గోల్కొండ,చార్మినార్,సాలార్ జంగ్ మ్యూజియం లతో పాటు జోగులాంబ గద్వాల జిల్లాలోని  ఆలంపూర్ టెంపుల్, వరంగల్ లోని రామప్ప దేవాలయం, వరంగల్ కోట తదితర పర్యాటక ప్రాంతాలన్నింటినీ ఈ నెలాఖరు వరకు మూసి ఉంచుతారు. 
  • లాక్ డౌన్ సడలింపు సమయంలో ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకు కూడా తెరవరు. పర్యాటకులను ఎవరిని సందర్శనకు అనుమతించరు.
  •  మొదటి దఫా వచ్చిన ఆదేశాల ప్రకారం నగరంలోని చార్మినార్,సాలార్ జంగ్ మ్యూజియం, గోల్కొండ కోటను మూసి వేశారు.
  •  సందర్శకులను ఎవరినీ అనుమతించడం లేదు.
  •  ప్రస్తుతం జీహెచ్ఎంసీ పరిధిలో పాజిటివ్ కేసులు గతంలో కన్నా కొద్దిగా తగ్గినప్పటికీ..లాక్ డౌన్ కొనసాగుతుండడంతో పర్యాటక ప్రాంతాల సందర్శన నిలిపి వేయడం బెటర్ అని భావించిన ఏఎస్ఐ ఈ నెలాఖరు వరకు ఆంక్షలను పొడిగించింది. 
  • ఒకవైపు ఫస్ట్ డోస్ టీకాల పంపిణీ నిలిచిపోవడం..రెండో డోస్ టీకాల పంపిణీ జోరుగా జరుగుతుండడంతో పాటు టెస్టులు తక్కువగా జరుగుతుండడంతో కరోనా వైరస్ వ్యాప్తి ఇంకా తగ్గడం లేదు. 
  • కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అవసరమైన మేరకు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా అంటున్నప్పటికీ..పాజిటివ్ కేసుల సంఖ్య మాత్రం ఆశించిన స్థాయిలో తగ్గడం లేదు.
  • దేశంలో కేసులను ద్రుష్టిలో ఉంచుకుని  ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా పురాతన కట్టడాల మూసివేతను మరో 16 రోజుల పాటు పొడిగించింది. 
  • ఇప్పటికే నగరంలో చారిత్రాత్మకమైన చార్మినార్ కట్టడం తో పాటు గోల్కొండ కట్టడాలు మూసి ఉన్నాయి. ప్రతి రోజు పర్యాటకులతో కిటకిటలాడిన చార్మినార్, గోల్కొండ కోట వీధులన్నీ ప్రస్తుతం వెలవెలబోతున్నాయి.
  •  పర్యాటక ప్రాంతాల పరిసరాలు నిర్మానుష్యంగా మారాయి.
  •  ఇప్పుడు ఏఎస్ఐ ఇచ్చిన ఆదేశాల మేరకు తిరిగి ఈ నెల 31వ తేదీ వరకు మూసి ఉంటాయి.
  •  ఈ విషయాన్ని పర్యాటకులు గమనించాలని సంబంధిత అధికారులు కోరుతున్నారు.
  •  ఏప్రిల్ 15వ తేదీకి ముందు చార్మినార్ కట్టడం సందర్శనకు ప్రతి రోజు వందల సంఖ్యలో సందర్శకులు వచ్చే వారు. 
  • కరోనా వైరస్ వ్యాప్తి వేగంగా జరుగుతున్నప్పటికీ..ఉమ్మడి తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల సందర్శకులు చార్మినార్ సందర్శనకు వస్తుండడంతో ఇక్కడ ప్రతి రోజు సందర్శకుల సందడి కనిపించింది.
  •  దీంతో స్థానికులు భయాందోళన వ్యక్తం చేశారు.
  •  స్థానిక ప్రజలు,పోలీసు అధికారుల ఫిర్యాదుల మేరకు ఏఎస్ఐ ఉన్నతాధికారులు మొదటగా 15 రోజుల పాటు నిరవధికంగా పర్యాటక ప్రాంతాలను మూసి వేశారు. 
  •  తిరిగి ఆశించిన స్థాయిలో పరిస్థితిలో మార్పు రాకపోవడంతో మరో 16 రోజుల పాటు పర్యాటక ప్రాంతాల సందర్శన నిలిపి వేశారు.
  • ఇక పాతనగరంలోని మరో చారిత్రాత్మకమైన మక్కా మసీదు లోకి గత నెల మొదటి నుంచి విజిటర్స్ ను అనుమతించడం లేదు.