areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

సీనియర్ జర్నలిస్టు ఎర్రం నర్సింగరావు మృతి..

  • ఈనాడు దిన పత్రికలో 30 ఏళ్లుగా విలేకరిగా పని చేసిన నర్సింగరావు..
  • టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శిగా పని చేసిన నర్సింగ్ రావు హఠాన్మరణంపై సంతాపం ప్రకటించిన టీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ.

ఆర్సీ న్యూస్, హైదరాబాద్ (నవంబర్ 20): సీనియర్ జర్నలిస్టు, ఈనాడు విలేకరి, తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్) వ్యవస్థాపక సభ్యుడు, రాష్ట్ర కార్యదర్శి ఎర్రం నర్సింగ్ రావు గారు సోమవారం తెల్లవారు జామున అనారోగ్యంతో హైదరాబాద్ లో మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన జీవితం పై విరక్తి కలిగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలిసింది. ఓవైపు జర్నలిస్టుగా తన బాధ్యతలు కొనసాగిస్తూనే మరోవైపు పలు సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్న ఎర్రం నర్సింగ్ రావు మృతి పట్ల టీడబ్ల్యూజేఎఫ్ తీవ్ర సంతాపం తెలిపింది. ఈ విషాదకర సంఘటన మమ్మల్ని  తీవ్రంగా కలచివేసిందన్నారు. ముప్పై ఏళ్ళుగా ఈనాడు దినపత్రికలో లోకల్ రిపోర్టర్ గా పనిచేస్తున్న నర్సింగ్ రావు జర్నలిస్టు ఫెడరేషన్ వ్యవస్థాపకుల్లో ప్రధాన పాత్ర వహించారు. సంఘం తరపున తెలంగాణ ఉద్యమంలో అనేక పోరాట కార్యక్రమాలు నిర్వహించారు. తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ యూనియన్ కు  నర్సింగ్ రావు గారు వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి గా పని చేశాం. అంతకుముందు హైదరాబాద్ జర్నలిస్ట్స్ యూనియన్ కార్యదర్శి గా పని చేశారు. సంఘం బాధ్యుడిని జర్నలిస్టుల సమస్యలపై చిత్త శుద్ధితో, అంకిత భావంతో నిస్వార్థంగా పని చేశారు. వృత్తి పట్ల కూడా అంకితభావంతో పనిచేశారు. గత రెండు సంవత్సరాల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. ఆసుపత్రిలో చికిత్స పొంది కోలుకున్నారు. నిరంతరం మెడిసిన్ వాడుతూ అప్పుడప్పుడు ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నాడు.  నాలుగు రోజుల క్రితం ఆస్పత్రిలో  చేరి ఆదివారం రాత్రి డిశ్చార్జ్ అయి ఇంటికి వచ్చాడు. సోమవారం తెల్లవారుజామున హఠాత్తుగా మృతి చెందారు. నర్సింగ్ రావు కు భార్య, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. నర్సింగ్ రావు మృతికి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ తీవ్ర సంతాపం తెలియజేస్తూ… ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేసింది. నర్సింగ్ రావు సంఘానికి చేసిన సేవలు మరువలేనివి. ఆయన మరణం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ కు తీరని లోటని ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు మామిడి సోమయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. బసవపున్నయ్య, ఉపాధ్యక్షులు పిల్లి రాంచందర్ పేర్కొన్నారు.