మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

ఉచిత మంచినీటి కోసం ఆగస్టు వరకు పొడిగింపు..

ఉచిత మంచినీటి కోసం ఆగస్టు వరకు పొడిగింపు..
  • ఆగస్టు 15 వరకు పొడిగించిన ప్రభుత్వం..
  • ప్రతి నెలా 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి సరఫరా
  • నల్లా కనెక్షన్ క్యాన్ నెంబర్ ను ఆధార్ తో అనుసంధానం చేసుకోవాలి..
  • కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా వెసులుబాటు కల్పించిన ప్రభుత్వం
  • మొదట్లో ఏప్రిల్ నెలాఖరు లోగా అవకాశం…
  • గడువు లోపు అనుసంధానం చేసుకోకపోతే..9 నెలల బిల్లులన్నీ చెల్లించాల్సిందే.

ఆర్సీ న్యూస్,జూలై 9 (హైదరాబాద్): ఉచిత మంచినీటి పథకం అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచింది. పథకం ప్రారంభించిన మొదట్లో గడువును ఏప్రిల్ నెలాఖరు వరకు  విధించింది. అప్పటిలోగా తమ నల్లా కనెక్షన్ క్యాన్ నెంబర్ ను తమ ఆధార్ కార్డుతో అనుసందానం చేసుకోవాలని కోరింది. గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం  ఉచిత మంచినీటి పథకానికి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. ఆదార్ కార్డుతో క్యాన్ నెంబర్ ను అనుసంధానం చేసుకుంటే..కుళాయిల ద్వారా మంచినీరు పొందే వినియోగదారులు నెలనెలా నీటి బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. మంచినీటి కనెక్షన్ క్యాన్ నెంబర్ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాల్సి ఉంది. క్యాన్ నెంబర్ను అనుసంధానం చేసుకోకపోతే ఉచిత మంచినీటి పథకానికి అర్హులు కారు. వెంటనే ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాలి. ఉచిత మంచినీటి పథకాన్నిరాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు జనవరి 12న,ప్రకటించిన విషయం తెలిసిందే. మంత్రి ప్రకటన వెలువడిన నెల నుంచి జలమండలి అధికారులు గత ఆరు నెలలుగా ఎలాంటి నీటి బిల్లులు వసూలు చేయడం లేదు. ముందుగా మార్చి నెలాఖరు వరకు చివరి గడువుగా జలమండలి ప్రకటించింది. అయితే గడువు ముగిసే లోపు ఆశించిన స్థాయిలో వినియోగదారులు తమ క్యాన్ నెంబర్ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోకపోవడంతో గడువును ఏప్రిల్ నెలాఖరు వరకు పొడిగించారు. అయినప్పటికీ…ఆశించిన స్థాయిలో వినియోగదారులు నల్లా కనెక్షన్ ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకో లేదు. దీంతో జలమండలి అధికారులు నల్లా బిల్లులు వసూలు చేయడానికి రంగంలోకి దిగారు. వినియోగదారులకు వేల రూపాయల్లో బకాయిలున్నట్లు బిల్లులు జారీ చేశారు. బకాయిలను వెంటనే చెల్లించాలంటూ డిమాండ్ చేశారు. బిల్లులను చూసిన వినియోగదారులు లబో దిబో మంటూ ఆందోళన వ్యక్తం చేశారు. కరోనా వైరస్ వ్యాప్తితో పాటు లాక్ డౌన్ తదితర సాంకేతిక కారణాల కారణంగా ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకో లేకపోయిన విషయం ప్రభుత్వం ద్రుష్టికి వెళ్లింది. వెంటనే గడువు పెంచుతు ఉత్తర్వులు జారీ చేసింది. మొదల్లోజలమండలి ఆధ్వర్యంలో ఉతిత మంచినీటి పథకం వినియోగంపై బస్తీలతో పాటు కాలనీలలో అవగాహాన కల్పించారు. ప్రతి నెలా 20 వేల లీటర్ల ఉచిత మంచినీటి పథకాన్నిపొందాలంటే తప్పనిసరిగా క్యాన్ నెంబర్ను ఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలని సంబంధింత జలమండలి అధికారులు సూచిస్తున్నారు. ఆగస్టు 15 లోపు  రిజిస్ట్రేషన్ చేయుంచుకోని వారు గత జనవరి నెల నుంచి బకాయి నీటి బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు(HMWSSB) పరిధిలో 2.5 లక్షల మీటర్లున్న మంచినీటి కనెక్షన్లు, 2 లక్షల మీటర్లు లేని కనెక్షన్లున్నాయి. వీరంతా కాన్ నెంబర్లతో ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోవాల్సి ఉండగా..కొంత మందే అనుసంధానం చేసుకున్నారు. వీరంతా అనుసంధానం చేసుకుంటే ఉచిత మంచినీటి సరఫరా పథకానికి అర్హులుగా ఉంటారు. లేదా నెలనెలా నీటి బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పటికే నీటి మీటర్లుండి ఆధార్ కార్డును అనుసంధానం చేసుకోకపోతే..ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సంబందిత జలమండలి అధికారులు కోరుతున్నారు. మీటర్లు లేని వారు జలమండలి అధికారులకు తెలియజేస్తే..నిర్దేశించిన రుసుం చెల్లిస్తే..మీటర్లు బిగించి అనుసంధానం చేస్తారు. ఆన్లైన్లో తమ క్యాన్ నెంబర్నుఆధార్ కార్డుతో అనుసంధానం చేసుకోవాలి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన ఉచిత మంచినీటి పథకాన్నిగ్రేటర్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని గ్రేటర్ జలమండలి డివిజన్-2 ఎ జనరల్ మేనేజర్ నాగేంద్రకుమార్ కోరారు. మరింత సమాచారం కోసం జలమండలి టోల్ ఫ్రీ నెంబర్ 155313 ను సంప్రదించాలని ఆయన సూచించారు.