ఏప్రిల్ 25, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

మీరాలంమండి అమ్మవారి దేవాలయ పంచమ వార్షికోత్సవ వేడుకలు..

ఆర్సీ న్యూస్ ( హైదరాబాద్):నిజాం కాలం నుంచి భక్తుల పాలిట కొంగు బంగారంగా..కోరిన కోర్కేలు తీర్చే మహాంకాళి అమ్మవారిగా పేరు తెచ్చుకున్న మీరాలంమండి శ్రీ మహాంకాళేశ్వర దేవాలయం పంచమ వార్షికోత్సవ వేడుకలు ఈ నెల 15వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. మూడు రోజుల పాటు అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకల్లో పలువురు అధికార,అనధికార ప్రముఖులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నట్లు ఉత్సవాల నిర్వాహకులు తెలిపారు. ఈ నెల 15,16,17 తేదీల్లో…అంటే వరుసగా మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల సందర్బంగా భక్తులకు ఎక్కడ ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా తగిన ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. దేవాలయం పునర్నిర్మాణం అనంతరం ప్రతి ఏడాది వార్షికోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది పంచమ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఫూజా కార్యక్రమాల్లో శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య హంపి విరూపాక్ష విధ్యారణ్య పీఠాధిపతి శ్రీ విధ్యారణ్య భారతి స్వామి పాల్గొంటున్నారు.

మీరాలంమండి అమ్మవారి దేవాలయం పంచమ వార్షికోత్సవ వేడుకలు..

1809 నుంచి మీరాలంమండి శ్రీ మహాంకాళి అమ్మవారికి పూజలు.. 

  • నిజాం కాలంలో హైదరాబాద్ నగర ప్రజలకు అవసరమైన కూరగాయలు, ఇతర నిత్యావసర వస్తువులు మీరాలంమండిలో అందుబాటులో ఉండేవి.
  •  నగరానికి చుట్టు పక్కల ఉండే గ్రామాలకు చెందిన రైతులు తాము పండించిన కాయకూరలను మీరాలంమండికి తీసుకొచ్చి విక్రయించే వారు.
  •  ఇలా వచ్చిన రైతులు స్థానికులతో కలిసి మహాంకాళి అమ్మవారికి ప్రతి రోజు పూజలు నిర్వహించే వారు. 
  • అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడి అమ్మవారికి నిరంతరం పూజలు నిర్వహిస్తున్నారు.
  •  మహిమ గల అమ్మవారు కావడంతో భక్తుల ఆధరణ రోజు రోజుకు పెరుగుతోంది. 
  • రాను రాను పూజలు విస్థరించాయి.
  •  తెలంగాణలో అత్యంత వైభవంగా నిర్వహించే బోనాల జాతర ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరుగుతాయి. 

2015లో దేవాలయం పుననిర్మాణం పనుల ప్రారంభం..

  • దేవాలయం కమిటి చైర్మన్ గాజుల అంజయ్య ఆధ్వర్యంలో దేవాలయం పుననిర్మాణం పనులు ప్రారంభమయ్యాయి.
  •  పాతనగరంలో అత్యంత విశాలంగా దేవాలయ పుననిర్మాణం జరిగింది.
  • 2015 నవంబర్ లో పుననిర్మాణ పనులు ప్రారంభమై…2016 ఏప్రిల్ 11న, పూర్తయ్యింది. 
  • అదే రోజు శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య హంపి విరూపాక్ష విధ్యారణ్య పీఠాధిపతి శ్రీ విధ్యారణ్య భారతి స్వామి చేతుల మీదుగా అమ్మవారి విగ్రహ పున ప్రతిష్ట జరిగింది. 
  • అప్పటి నుంచి ప్రతి ఏడాది వార్షికోత్సవ వేడుకలను కన్నుల పండువగా అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు. 
  • ఇందులో భాగంగా ఈ నెల 15,16,17 తేదీల్లో మూడు రోజుల పాటు పంచమ వార్షికోత్సవాలను నిర్వహిస్తున్నట్లు కమిటి చైర్మన్ గాజుల అంజయ్య తెలిపారు.

పూజా కార్యక్రమాల వివరాలు ఇలా..

  • పంచమ వార్షొకోత్సవాల్లో భాగంగా ఈ నెల 15,16 తేదీల్లో తెల్లవారు జామున 3 గంటలకు సుప్రభాత సేవ, గణపతి పూజతో వార్షికోత్సవ పూజలు మొదలవుతాయి.
  •  పంచ హోమాలు, ద్వాజారోహనం, అగ్ని ప్రతిష్ట తదితర పూజా కార్యక్రమాలుంటాయి. 
  • ఇక 17వ తేదీన..జరిగే పూజా కార్యక్రమాలన్నీ శ్రీ జగద్గురు ఆది శంకరాచార్య హంపి విరూపాక్ష విధ్యారణ్య పీఠాధిపతి శ్రీ విధ్యారణ్య భారతి స్వామి చేతుల మీదుగా జరుగుతాయి.
  •  అష్టోత్తర మహా కుంబాభిషేకం, మహాపూర్ణాహుతి,మహా పంచహారతి తదితర పూజా కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు చైర్మన్ తెలిపారు. 
  • అలాగే అగ్ని ప్రతిష్ట, రుద్రహోమం, ఛండీహోమం,నవగ్రహ హోమం తదితర పూజా కార్యక్రమాలుంటాయి.