areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

Minister KTR : అత్యాధునిక పద్దతిలో పరిశుభ్రమైన  హైదరాబాద్ నగరం..

Minister KTR : అత్యాధునిక పద్దతిలో పరిశుభ్రమైన  హైదరాబాద్ నగరం..
  • ఇప్పటికే తడి,పొడి చెత్త తొలగింపునకు 4500 స్వచ్ఛ ఆటోలు..
  • మరో నెల రోజుల్లో 400 స్వచ్ఛ ఆటోలు అందుబాటులోకి..
  • నగరంలో  17 చెత్త ట్రాన్స్ ఫోర్టు స్టేషన్లు..
  • రూ.3866 కోట్లతో సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ల ఏర్పాటు..
  • చెరువులో గుర్రపు డెక్క తొలగింపుకు అత్యాధునిక పద్ధతి: మంత్రి కేటీఆర్ వెల్లడి..

ఆర్సీ న్యూస్, మార్చి 02 (హైదరాబాద్): అత్యాధునిక, మెరుగైన  పద్దతిలో హైదరాబాద్ నగరాన్ని పరిశుభ్రంగా చేయడం జరుగుతుందని రాష్ట్ర మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి తారక రామారావు అన్నారు.  బుధవారం నెక్లెస్ రోడ్డులో ఆధునిక సాంకేతిక పద్ధతిలో వ్యర్థాలను తరలించే వివిధ రకాల వాహనాలను  రాష్ట్ర మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీ, మేయర్ గద్వాల్ విజయ లక్ష్మి, కమిషనర్ లోకేష్ కుమార్, డిప్యూటీ మేయర్ శ్రీలత శోభన్ రెడ్డి, రాంకీ సి.ఇ.ఓ గౌతమ్ రెడ్డి లతో కలిసి  60 వాహనాలను మంత్రి కె.టి.ఆర్ ప్రారంభించారు.

MINISTER KTR inaugurated new vehicles for ghmc

 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ముఖ్యంగా నగరాల్లో రెండు రకాల వ్యర్ధాలు ఉత్పత్తి అవుతాయి. అందులో ఘన, ద్రవ వ్యర్థాలు ఉత్పత్తి అవుతాయని అన్నారు.

రాష్ట్ర ముఖ్యమంత్రి కే సి ఆర్  స్వచ్ఛ తెలంగాణ, స్వచ్ఛ హైదరాబాద్ కార్యక్రమాన్ని 2015 లో ప్రారంభించారు. అప్పుడే సమగ్రమైన, అర్థవంతమైన, ఆచరణాత్మకంగా ప్రాక్టికల్ ఎజెండా తీసుకొని  హైదరాబాద్ నగరంలో ఉత్పత్తి అవుతున్న వ్యర్ధాలను సేకరణ పూర్తి స్థాయిలో పరిష్కారం చేయడం జరుగుతున్నది

   2013-14 సంవత్సరంలో  2500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అయ్యేది. గౌరవ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు నగరాన్ని పరిశుభ్రంగా ఉండాలనే ఉద్దేశం మేరకు జిహెచ్ఎంసి రాంకీ కలిసి కట్టుగా  సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ సమర్థవంతంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు 6500 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు ఉత్పత్తి అవుతున్న వ్యర్థాలను 4500 స్వచ్ఛ ఆటోల ద్వారా సేకరిస్తున్నట్లు మంత్రి వివరించారు. మరో 400  స్వచ్ఛ ఆటోలను  నెల రోజుల్లో రానున్నట్లు చెప్పారు.

2015  సంవత్సరంలో 2500 స్వచ్ఛ ఆటోలు  ప్రారంభించి, 650 ఆటోలు 2020 సంవత్సరం లో గత సంవత్సరం డిసెంబర్  మాసంలో  1350  ఆటోలు పంపిణీ చేశామని మరో 400 స్వచ్ఛ  ఆటోలు నెలరోజులలో వస్తున్న నేపథ్యంలో మొత్తం 5000 స్వచ్ఛ ఆటో లతో  జిహెచ్ఎంసి పరిధిలో గల 150 డివిజన్ లో ప్రాథమిక దశలో చేపట్టే ఇంటింటికి తిరిగి సేకరణ సమర్థవంతంగా జరుగుతుంది.

గతంలో సేకరణ సందర్భంగా  చెత్త రోడ్డు పై వెదజల్లుతూ ఉండేది. హైదరాబాద్ విశ్వ నగరంగా స్థాయిలో ఆధునిక వ్యవస్థను ఏర్పాటు చేయుటకు Refuse container వెహికల్, హుక్ మౌంటెడ్ వెహికల్, సిలిండ్రికల్  స్టాటిక్ కంటైనర్  లను అందుబాటులోకి తీసుకుని రావడం జరిగిందన్నారు.

Minister KTR : చెత్త రోడ్లపై వేదజల్లకుండా అధివృద్ది చెందిన దేశాల్లో ట్రాన్స్ పోర్ట్  ఏర్పాట్లు ఏ విధంగా ఉంటుందో ఆ రకమైన ఏర్పాట్లు  హైదరాబాద్ మహా నగరంలో కూడా ఏర్పాటు చేస్తున్నామన్నారు.  

నగరంలో 17  ట్రాన్స్ పోర్ట్ స్టేషన్ లను  నిర్వహిస్తుండగా  అందులో 11 ఆధునీకరించడం జరిగిందని, మరో 4 ప్రగతిలో ఉన్నాయి. మిగుతా 2 కూడా  పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఏర్పాటు చేసిన 17 ట్రాన్స్ పోర్ట్ స్టేషన్  చుట్టూ ప్రక్కల  ప్రజలకు  ఎలాంటి దుర్గంధం,  ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత  అధికారులపై ఉందన్నారు. 17 ట్రాన్స్ ఫర్ స్టేషన్లు సరిపోను లేకపోవడం తో  150 డివిజన్ లలో 95 సెకండరీ కలెక్షన్ ట్రాన్స్ ఫర్ పాయింట్స్  ఏర్పాటు చేసినట్లయితే ప్రాథమిక స్థాయిలో సేకరణ తర్వాత తరలింపు దూరం కాకుండా స్వచ్ఛ ఆటో లు కూడా  రోజు వారి సేకరణ వందకు వంద శాతం వీలౌతుందన్నారు. నగరం లో 24 స్టాటిక్ ఎస్.టి.పి లతో పాటుగా 71 మొబైల్ ఎస్ టి పి లు కాగా ఇప్పుడు మరో 20 మొబైల్ ఎస్ టి పి ల ఏర్పాటుకు  64 హుక్ మౌంటెడ్ వెహికిల్  మారో 20 వాహనాల అంతేకాకుండా  సిలిండ్రికల్  స్టాటిక్ కంటైనర్ 76 కాగా మరో 20 వాహనాలు మొత్తం 60 వాహనాలను  ప్రారంభించి అందుబాటులోకి తెస్తున్నట్లు మంత్రి అన్నారు.

కనబడకుండా  సవ్యమైన పద్దతి లో రవాణా చేశారన్నారు.  వ్యర్థాలు ముఖ్యంగా  కలెక్షన్, ట్రాన్స్ పోర్ట్, ట్రీట్మెంట్ ప్రక్రియ ఉంటుందన్నారు. దక్షిణ భారతదేశంలో వ్యర్థాల నుండి అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని రూ. 485 కోట్ల తో 24 మెగావాట్ల విద్యుత్  ప్లాంట్ ను ప్రారంభించినట్లు, మరో 24 మెగావాట్ల  విద్యుత్ కేంద్రాన్ని రూ. 550 కోట్ల తో నిర్మాణం చేస్తున్నట్లు  చెప్పారు. జవహర్ నగర్  డంప్ యార్డులో పేరుకుపోయిన వ్యర్థాల వల్ల  చుట్టూ ఉన్న గ్రామాల ప్రజలకు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా 140 కోట్ల ఖర్చుతో క్యాపింగ్ చేసినట్లు అంతే కాకుండా వర్షాల కారణంగా డంప్ యార్డు లో గల వ్యర్థాల వలన ఏర్పడిన లీచెట్  వల్ల చెరువులు కలుషితం కాకుండా రూ. 250 కోట్ల తో ట్రీట్మెంట్ చేస్తున్నట్లు తెలిపారు.

ఘన వ్యర్థాల తో పాటు ద్రవ వ్యర్థాల  ట్రీట్మెంట్ కూడా ప్రాధాన్యతనిస్తూ  రూ. 3866 కోట్ల తో సివరేజ్ ట్రీట్ మెంట్ ప్లాంట్ ను  ఏర్పాటు చేస్తున్నట్లు అదే విధంగా నగరంలో చెరువుల లో గల వ్యర్థాలను గుర్రపు డెక్క తొలగింపు కు అత్యాధునిక పద్దతిలో శుభ్రం చేస్తున్నట్లు అందుకోసం ఫ్లోటింగ్ ట్రాష్ కలెక్టర్ జిహెచ్ఎంసి కి ఆరు వాహనాలను  ఏర్పాటు చేసినట్లు పెద్ద వాహనానికి ఒక కోటి 50 లక్షల రూపాయల విలువ గల 3 వాహనాలు కోటి రూపాయల విలువ గల  మరో 3 వాహనాలు కొనుగోలు చేసినట్లు మంత్రి వివరించారు. అత్యాధునిక పద్ధతిలో సాలిడ్, లిక్విడ్, మేనేజ్మెంట్ ప్రక్రియ భారత దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్ నగరం లో చెపట్టుతున్నట్లు మంత్రి కేటిఆర్ అన్నారు.

రాష్ట్ర  పశుసంవర్ధక, ఫిషరీస్, సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ… మారుతున్న సమాజానికి అనుగుణంగా ఆధునిక టెక్నాలజీని వినియోగించుకుంటూ నగర ప్రజలకు మెరుగైన  సౌకర్యాలు  కల్పిస్తున్నట్లు అన్నారు. నగర ప్రజలకు అండర్ పాస్ లు, స్టీల్ బ్రిడ్జి,  నాలా అభివృద్ది పనులు,  వైకుంఠ దామాలు, పార్క్ లు, ఫుట్ పాత్ లు  చాలా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతున్నట్లు వివరించారు. ఆధునిక పద్ధతిలో వ్యర్థాల నిర్వహణ  జరుగుతున్నట్లు  గత 30 సంవత్సరాల నుండి రాజకీయ లలో ఎంతో మంది చూసాను. కానీ నగర అభివృద్ధికి వినూత్న పద్ధతిలో నగర అభివృద్ధికి కృషి చేస్తున్న డైనమిక్ మంత్రిని చూడలేదన్నారు. 

ఈ కార్యక్రమంలో  ఖైరతాబాద్ శాసన సభ్యులు దానం నాగేందర్, కార్పొరేట్ పి.విజయ రెడ్డి, హెల్త్ అండ్ శానిటరీ అడిషనల్ కమిషనర్ బి సంతోష్, జాయింట్ కమిషనర్ సంధ్య, జోనల్ కమిషనర్లు శ్రీనివాస్ రెడ్డి, రవికిరణ్,  హౌసింగ్ ఓ ఎస్ డి సురేష్ కుమార్, ఎస్.డబ్లు.ఎం.ఎస్.సి కోటేశ్వరరావు,  రాంకీ  జె.ఎం.డి  మాసూద్, వెంకటేశ్వర్లు వైస్ ప్రెసిడెంట్ తదితరులు పాల్గొన్నారు.