మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

కోవిడ్ వ్యాప్తి లో పోలీసుల సేవలు అభినందనీయం…

కోవిడ్ వ్యాప్తి లో పోలీసుల సేవలు అభినందనీయం...
  • తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందజేసిన పోలీసులు..
  • కుటుంబాలకు దూరంగా ఉంటూ విధి నిర్వహణ కొనసాగించిన పోలీసులు..
  • కరోనా మహమ్మారిని మూకుమ్మడిగా ఎదుర్కొన్నాం..
  • మహమ్మారి సమయంలో పోలీసుల సేవలు భేష్..
  • రాచకొండ పోలీస్ కమిషనర్ ఎం.ఎం. భగవత్..

ఆర్సీ న్యూస్, నవంబర్ 16 (హైదరాబాద్): గత ఏడాది ప్రపంచ వ్యాప్తంగా కరోన వైరస్ ప్రజలను గజగజ వణికిస్తున్న సమయంలో  ఎంతో నిబ్బరంగా ఆత్మ ధైర్యంతో పోలీసులు ఉత్తమ సేవలు అందజేశారని రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ ఎం భగవతి పోలీసుల సేవలను కొనియాడారు. కరోన వైరస్ వ్యాప్తి సమయంలో ఉత్తమ సేవలు అందజేసిన పోలీసులు ఎంతో అభినందనీయులన్నారు. కోవిడ్ వ్యాప్తి వేగంగా జరుగుతున్న సమయంలో పోలీసులు తమను తాము కాపాడుకుంటూ వైరస్ సోకిన ప్రజలను సైతం కాపాడారన్నారు. ఎలాంటి భయాందోళనకు గురి కాకుండా ఉత్తమ సేవలను అందజేశారన్నారు. తమ కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ విధి నిర్వహణ కొనసాగించిన పోలీస్ అధికారులతో పాటు పోలీస్ సిబ్బంది అందరికీ ఆయన ధన్యవాదాలు తెలిపారు. తమ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ ఎంతో పటిష్టంగా ఉందని.. వివిధ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేసే పోలీస్ సిబ్బంది నిరంతరం తమ సేవలను అందజేస్తున్నారన్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా చూస్తూనే సంఘవిద్రోహ శక్తుల పట్ల కఠినంగా వ్యవహరిస్తూ ప్రజలకు ఎల్లప్పుడూ రక్షణగా ఉంటున్నా రన్నారు. పోలీసులు వైరస్ వ్యాప్తి సమయంలో ఎలాంటి వెనకడుగు వేయకుండా ప్రజలకు అన్ని రకాల సేవలను అందజేయడంలో ముందున్నారన్నారు. పోలీసుల సేవలను డిపార్ట్మెంట్ ఎప్పటికీ గుర్తిస్తుందన్నారు. మహమ్మారి సమయంలో పోలీసులు ఎంతో మంది ప్రాణాలను కాపాడారని మహేష్ ఎం. భగవత్ అన్నారు. కోవిడ్ మహమ్మారి మధ్య రాచకొండ పోలీసుల కృషి, సేవలను ప్రశంసించే ఉద్దేశ్యంతో, రాచకొండ కమిషనరేట్ మంగళవారం నేరేడ్‌మెట్‌లో హోంగార్డులకు కిరాణా కిట్‌లను పంపిణీ చేసింది.  నెస్లే ఇండియాతో భాగస్వామ్యమై ఉన్న డాన్ బాస్కో దాదాపు 1030 కిరాణా కిట్‌లను విరాళంగా అందించింది, 

ఈ సందర్భంగా కమీషనర్ ఎం.ఎం.భగవత్ మాట్లాడుతూ… డాన్ బాస్కో, నెస్లే ఇండియాలు రూ. 11 లక్షల విలువైన కిరాణా కిట్‌లు (ఒక్కో కిట్‌లో 1100 రూపాయల విలువైన వస్తువులు) అందించడం పట్ల ఆయన అభినందించారు. కోవిడ్ మహమ్మారి సమయంలో రాచకొండ పోలీసుల కృషి తో పాటు వారి సేవలను గుర్తించి నందుకు డాన్ బాస్కో, నెస్లే ఇండియాలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ సమయంలో రక్షించబడిన బాధితులకు తాత్కాలిక ఆశ్రయం కల్పించడం ద్వారా పోలీసులకు సహాయం చేస్తున్న డాన్ బాస్కోకు హైదరాబాద్‌లో పిల్లల గృహాలు ఉన్నాయని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు. నోయెల్ మద్దిచెట్టి డైరెక్టర్, బోస్కోనెట్ మాట్లాడుతూ.. తాము ఇంతకు ముందు ఆహారాన్ని పంపిణీ చేశామని, డాన్ బాస్కో, నెస్లే ఇండియా ద్వారా దేశవ్యాప్తంగా 6 మిలియన్ల కిట్‌లను పంపిణీ చేశామని చెప్పారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా 20 వేల కిట్లను పంపిణీ చేశామన్నారు. మహమ్మారి సమయంలో రాచకొండ కమిషనరేట్ పోలీసులు అవిశ్రాంతంగా సేవలందించినందుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.