areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

బెస్ట్ టూరిజం విలేజ్ గా భూదాన్ పోచంపల్లి..

బెస్ట్ టూరిజం విలేజ్ గా భూదాన్ పోచంపల్లి..
  • ప్రపంచ పర్యాటక సంస్థ నిర్వహించిన పోటీల్లో భూదాన్ పోచంపల్లికి దక్కిన ఘనత..
  • ప్రపంచ పర్యాటక సంస్థ నిర్వహించిన బెస్ట్‌ టూరిజం విలేజ్‌ పోటీల్లో భారత్‌ నుంచి తెలంగాణ తో పాటు మేఘాలయ మధ్యప్రదేశ్ రాష్ట్రాల నుంచి రెండు గ్రామాలు పోటీపడ్డాయి.
  • ప్రపంచవ్యాప్తంగా 75 దేశాల నుంచి 175 ప్రతిపాదనలు..
  • ఇందులో భూదాన్ పోచంపల్లికి బెస్ట్ టూరిజం విలేజ్ ఘనత దక్కింది.

ఆర్సీ న్యూస్, నవంబర్ 16 (హైదరాబాద్): ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల నుంచి 175 ప్రతిపాదనలు రాగా.. తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి గ్రామం బెస్ట్ టూరిజం విలేజ్ గా ఎంపికైంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సిఎం కెసిఆర్ నేతృత్వంలో కాకతీయుల కళా సంపద రామప్ప దేవాలయంకు యూనేస్కో వారసత్వ కట్టడాల జాబిత లో గుర్తింపు లభించింది. గ్రామీణ పర్యాటక రంగాన్ని ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్యసమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఆధ్వర్యంలో బెస్ట్ టూరిజం విలేజ్ కాంటెస్ట్ను నిర్వహించింది. సాంఘిక, ఆర్ధిక, పర్యావరణ రంగాల్లో సుస్థిరాభివృద్ధి, గ్రామీణ సాంస్కృతిని ఎలా పరిరక్షిస్తున్నారు.. గ్రామీణ పర్యాటకానికి ఎంత స్కోప్ ఉంది.. అక్కడి ప్రజలు దానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు..అనే అంశాలను పరిగణనలోకి తీసుకు న్నారు. గ్రామీణ పర్యాటకానికి ఊతం ఇచ్చేలా వాటి అభివృద్ధికి, అక్కడ నివసిస్తున్న ప్రజల జీవనశైలి , నూతన పద్ధతిలో ప్రపంచానికి తెలియ జేయడంలో భాగంగా ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ ఈ పోటీలు నిర్వహిస్తోంది. పర్యాటక రంగానికి ప్రోత్సాహకం, గ్రామీణ ప్రాంతాల్లో జనాభాను పెంచడం, మౌలిక వసతుల కల్పన , సంప్రదాయాల పరిరక్షణ, వాటిని భావితరాలకు అందించటంతో పాటు ఆర్థిక అసమానతల తొలగింపు ఈ పోటీ ఉద్దేశం. ఎంపికైన గ్రామాలను అభివృద్ధి చేయటం, గుర్తింపు తీసుకురావటం వంటి పనులు ఈ సంస్థ చేస్తుంది. ప్రపంచ వ్యాప్తంగా తోలిసారిగా ప్రపంచ పర్యాటక సంస్థ నిర్వహిస్తున్న బెస్ట్ టూరిజం విలేజ్ గుర్తుంపులో భాగంగా కేంద్ర పర్యాటక శాఖ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్రంలో గల పర్యాటక పరంగా ఉత్తమ గ్రామీణ ప్రాంతాలను గుర్తించి ప్రపంచ పర్యాటక సంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా వాటిని పరిశీలించి వాటి స్థితిగతుల పై సమగ్ర నివేదిక ను తయారు చేసి భూదాన్ పోచంపల్లిని ఎంపిక చేయడం జరిగింది. ప్రపంచ వ్యాప్తంగా 75 దేశాల నుండి 170 ప్రతిపాదనలు ఐక్యరాజ్యసమితి వరల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ (UNWTO) కు వేళ్లాయి.  అందులో మన దేశం నుంచి భూదాన్‌ పోచంపల్లితో పాటు మేఘాలయలోని కాంగ్‌థాన్, మధ్యప్రదేశ్‌లోని లద్‌పురాఖాస్‌ కూడా పోటీలో ఉండగా…తెలంగాణ ప్రభుత్వం పంపిన నివేదిక ఆధారంగా ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) నిర్వహించిన బెస్ట్‌ టూరిజం విలేజ్‌ పోటీల్లో భూదాన్‌ పోచంపల్లి గ్రామం ఈ ఘనత సాధించింది. డిసెంబర్ 2న స్పెయిన్‌లోని మాడ్రిడ్‌లో జరిగే UNWTO జనరల్ అసెంబ్లీ 24వ సెషన్‌లో ఈ ప్రతిష్టాత్మక అవార్డు ప్రదానం చేస్తున్నట్లు ప్రకటించింది. రాష్ట్రంలోని చారిత్రక, పర్యాటక ప్రదేశాలకు అంతర్జాతీయ గుర్తింపు లభిస్తోంది. ఇటీవలే రామప్ప దేవాలయానికి యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాను కల్పించగా.. ఇప్పుడు ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా పని చేస్తున్న ప్రపంచ పర్యాటక సంస్థ (యూఎన్‌డబ్ల్యూటీవో) తోలిసారిగా నిర్వహించిన బెస్ట్‌ టూరిజం విలేజ్‌ పోటీల్లో మన దేశం నుంచి పోటీ పడిన యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్‌ పోచంపల్లి గ్రామం ఆ ఘనత సాధించింది. ఇక, భూదాన్‌పోచంపల్లికి పేరుకు తగినట్టుగా చారిత్రక నేపథ్యం కూడా ఉంది.. భూదానోద్యమానికి అంకురార్పణ చేసి చరిత్ర సృష్టించింది ఈ గ్రామం.. చేనేత వస్త్రాలకు, చేనేత కళాకారుల కళా నైపుణ్యానికి పెట్టింది పేరు పోచంపల్లి.. 1951లో మహాత్మాగాంధీ ప్రియ శిష్యుడైన ఆచార్య వినోబాభావే పోచంపల్లిలో పర్యటించడం.. ఆయన పిలుపు మేరకు వెదిరె రాంచంద్రారెడ్డి హరిజనులకు 100 ఎకరాల భూమి దానం చేయడంతో భూదానోద్యమానికి అంకురార్పణతో చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని పొందింది. మరోవైపు.. పోచంపల్లి చేనేత వస్త్రాలకు ప్రత్యేక స్థానం ఉంది.. చేనేత కళాకారుల ప్రతిభతో సిల్క్ సిటీ గా పేరు తెచ్చుకుంది. యాదాద్రి భువనగిరి జిల్లా వ్యాప్తంగా.. 5,294 చేనేత మగ్గాలకు జియో ట్యాగింగ్ ఉంటే, అందులో సగం భూదాన్ పోచంపల్లిలోనే ఉన్నాయి. గ్రామ జనాభాలో 65 శాతం మంది చేనేత కార్మికులే ఉన్నారు. జిల్లాలో ఉన్న చేనేత కార్మికుల్లో అత్యధిక సంఖ్య పోచంపల్లిదే. పోచంపల్లి చరిత్ర పుట్టల్లోకి వెళ్తే.. నిజాం పాలన సమయంలోనూ నిజాం ప్రభువులు. అరబ్‌ దేశాలకు తేలియాడు రుమాళ్లు, గాజులు, పూసలను ఎగుమతి చేసేవారు. ఇక, ఎన్నో ప్రత్యేకతలు కలిగిన భూదాన్‌ పోచంపల్లి దేశ, విదేశీయులకు అధ్యయన కేంద్రంగా మారిపోయింది.. భూదానోద్యమ చారిత్రక గాథ, గ్రామీణ పర్యాటక కేంద్రం, చేనేత, చేతి వృత్తులతో పాటు కుటీర పరిశ్రమలు మరోవైపు వ్యవసాయానికి నిలయంగా కొనసాగుతూ వస్తోంది. ఇంకోవైపు నిరుద్యోగ యువతకు ఉచిత స్వయం ఉపాధి కోర్సులకు శిక్షణ ఇస్తున్న జలాల్‌ పురంలోని స్వామి రామానందతీర్థ గ్రామీణ సంస్థ రాష్ట్రంలోనే పేరు తెచ్చుకోవడం మరో విశేషంగా చెప్పుకోవచ్చు. ఇప్పటికే భూదాన్‌ పోచంపల్లిని అగ్ర రాజ్యాలకు చెందిన టూరిస్టులను ఆకర్షించింది. అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్, చైనా, రష్యా.. ఇలా 100 దేశాలకు పైగా పర్యాటకులు ఈ గ్రామాన్ని సందర్శించారు. ఇక, ప్రపంచ టూరిజం సంస్థ ‘బెస్ట్‌ టూరిజం విలేజ్‌’ గౌరవాన్ని దక్కించుకున్న ఈ గ్రామానికి మరింతగా పర్యాటకుల తాకిడీ పెరగనుందని అంచనా వేస్తున్నారు. చారిత్రక నేపథ్యం ఉన్న గ్రామాన్ని బెస్ట్‌ టూరిజం విలేజ్‌గా ఎంపిక చేయడంపై ఆ గ్రామ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలు కూడా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచ టూరిజం సంస్థ ‘బెస్ట్‌ టూరిజం విలేజ్‌’ గౌరవాన్ని దక్కించుకున్న భూదాన్ పోచంపల్లి కి పర్యాటకుల తాకిడి దృష్టిలో పెట్టుకోని పర్యాటకులకు మరిన్ని మౌలిక సదుపాయాల కల్పనను యుద్ద ప్రతిపాదికన ఎర్పాట్లు చేస్తున్నా మని పర్యాటక, ఆబ్కారీ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. పోచంపల్లి చేనేత కళాత్మక ఉత్పత్తులు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పోందే అవకాశాలున్నాయని… తెలంగాణ రాష్ట్రంలో విదేశీ పర్యాటకులు సంఖ్య త్వరలో ఘననీయంగా పేరిగే అవకాశాలున్నా యని మంత్రి శ్రీ వి. శ్రీనివాస్ గౌడ్ వెల్లడించారు..