మార్చి 28, 2024

areseenews

ఎప్పటికప్పుడు..మీకోసం

నగరంలో పటిష్టంగా లాక్ డౌన్ అమలు: అంజనీకుమార్

నగరంలో పటిష్టంగా లాక్ డౌన్ అమలు: అంజనీకుమార్
  • లాక్ డౌన్ కు సహకరిస్తున్న99 శాతం నగర ప్రజలు
  • కేవలం 1 శాతం మాత్రమే రోడ్ల మీదకు..
  • ఇప్పటి వరకు 9000 కేసుల నమోదు
  • 7000 వాహనాల స్వాధీనం
  • నగరంలో పర్యటించిన సీపీ అంజనీకుమార్
  • ఈసారి పాతబస్తీలో పకడ్బందీగా ఆంక్షలు అమలు
  • మదీనా సర్కిల్ లో కరోనా వైరస్ వ్యాప్తి పై అవగాహన
  • అనవసరంగా రోడ్ల మీదకు రావద్దని పిలుపు

ఆర్సీ న్యూస్(హైదరాబాద్): నగరంలో లాక్ డౌన్ పటిష్టంగా కొనసాగుతోందని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ అన్నారు. ఈసారి హైదరాబాద్ నగరంలోని పాతబస్తీలో లాక్ డౌన్ అమలు పక్కాగా జరుగుతోందని..ఇక్కడి పోలీసులు పకడ్బందీగా పని చేస్తున్నారని ఆయన కొనియాడారు. శనివారం ఆయన నగరంలోని ఈస్ట్ జోెన్, సెంట్రల్ జోన్ లతో పాటు సౌత్ జోన్ లలో పర్యటించి లాక్ డౌన్ అమలు తీరును పరిశీలించారు. పాతబస్తీ మదీనా సర్కిల్ వద్ద కొనసాగుతున్న చెక్ పోస్ట్ ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలను ద్రుష్య రూపంలో కళ్లకు కట్టినట్లు ప్రదర్శించి అవగాహన కల్పించారు. కరోనా వైరస్ వేషాధారణ ఆకట్టుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..నగరంలో లాక్ డౌన్ పటిష్టంగా అమలు జరుగుతుందన్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చి కరోనా వైరస్ వ్యాప్తికి బాధ్యులు కావద్దన్నారు. లాక్ డౌన్ విధించిన సమయంలో ఇంటి వద్దే సురక్షితంగా ఉండాలన్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో డౌన్ చక్కగా అమలు జరుగుతుంద న్నారు. 99 శాతం అన్ని వర్గాల ప్రజలు లాక్ డౌన్ కు సహకరిస్తు న్నారన్నారు. కేవలం 1 శాతం మంది యువకులు కావాలని రోడ్ల మీదకు వచ్చి కరోనా వైరస్ వ్యాప్తికి పాల్పడుతున్నారన్నారు. కరోనా వైరస్ చైన్ ను బ్రేక్ చేయాల్సిన అవసరం ఉన్నందున తామంతా ఇళ్లలోనే ఉండాలన్నారు. అవసరం లేకుండా రోడ్ల మీదకు వచ్చిన వారిపై ఇప్పటి వరకు 9 వేల కేసులు నమోదు చేశామన్నారు. 7 వేల వాహనాలను స్వాధీనం చేసుకున్నమన్నారు. సకాలంలో వైద్య సేవలు పొందడమే కాకుండా కరోనా వైరస్ కట్టడికి అవసరమైన అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలన్నారు. వైరస్ తో బాధపడుతున్నవారందరూ ఎలాంటి మానసిక ఆందోళనకు గురికావద్దన్నారు. కొంతమంది తమకు కరోనా వైరస్ సోకిందని అనవసరంగా భయాందోళనలకు గురవుతున్నారని..భయమే మనిషిని కడతేరుస్తుందన్నారు. నిలకడగా తమ ఆరోగ్యాన్ని ఎప్పటికప్పడు పరిశీలించుకుంటూ వైద్యులు సూచించిన సలహాలు, సూచనలతో పాటు అవసరమైన ఐసోలేషన్ మెడికల్ కిట్లు వాడుతున్న వారు కోలుకుంటున్నారన్నారు.

   లాక్ డౌన్ ను మరింత పటిష్టంగా అమలు చేస్తే..కరోనా వైరస్ చైన్ ను బ్రేక్ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు

లాక్ డౌన్ ను మరింత పటిష్టంగా అమలు చేస్తే..కరోనా వైరస్ చైన్ ను బ్రేక్ చేయడానికి అవకాశం ఉంటుందన్నారు. కరోనా కట్టడికి రోడ్లపై వాహనాల రాకపోకలను కట్టడి చేస్తున్నామన్నారు. దానికి అందరి సహకారం ఎంతో అవసరమని నగర సీపీ అంజనీ కుమార్ అన్నారు. ఢిల్లీ,ముంబాయ్, బెంగళూర్ లలో పాజిటివ్ కేసులు తగ్గుతున్నాయన్నారు. తమ పోలీసు సిబ్బంది రౌండ్ ది క్లాక్ సేవలను అందజేస్తున్నారన్నారు. కుటుంబ సభ్యులకు దూరంగా 24 గంటలు విధినిర్వాహణ లోని పోలీసులకు అన్ని వర్గాల ప్రజల సహకారం అవసరమన్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వాహనాలను తనిఖీలు చేసి స్వాధీనం తీసుకుంటున్నా మన్నారు. లాక్ డౌన్ ఉన్నప్పటికీ..కొంతమంది ఎలాంటి అత్యవసర పరిస్థితులు లేనప్పటికి.. రాకపోకలు సాగిస్తుండడంతో కరోనా వైరస్ వ్యాప్తి పెరిగే అవకాశాలున్నా యన్నారు. పోలీసులు తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి ప్రజల రక్షణ కోసం రౌండ్ ది క్లాక్ పని చేస్తున్నారని అంజనీకుమార్ అన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి తమతో పాటు ప్రజల భాగస్వామ్యం ఎంతో అవసరమన్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే నగర ప్రజలు లాక్ డౌన్ అమలును చక్కగా పాటిస్తున్నారన్నారు. అందుకే పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయన్నారు.